పాణిని: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 29:
 
== ప్రభావం ==
పాణిని సూత్రాలకు ఎందరో మహా పండితులు వార్తికాలు రాశారు. అందులో పతంజలి పేర్కొన్న వారు [[కాత్యాయనుడు]], భారద్వాజుడుభరద్వాజుడు, సునాగుడు, క్రోస్ట, బాడవుడు అనే అయిదుగురు ముఖ్యులు. వృత్తి అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవృత్తి అని అర్ధం. వార్తికం అంటే వృత్తికి వ్యాఖ్యానం. వార్తిక కారుడికే వాక్య కారుడు అనీ పేరుంది. ఇందులో కాత్యాయనుని వార్తికం ప్రసిద్ధి పొందింది. కాత్యాయనుడికే వరరుచి, మేధాజిత్, పునర్వసు, కాత్యుడు అనే పేర్లున్నాయి. పాణిని ముఖ్య శిష్యుడే కాత్యాయనుడు. దక్షిణ దేశం వాడు. ఈ విషయాన్ని ఒక సూత్రంలో [[పతంజలి]] ప్రకటించాడు. పాణినీయం పై పతంజలి రాసిన భాష్యాన్ని ''మహా భాష్యం'' అంటారు. దీనికే ''పద'' అనే పేరు కూడా ఉంది. [[సూత్రం]]లో వార్తికంలో అభిప్రాయ భేదం వస్తే ''పాతంజలీయం'' మాత్రమే ప్రమాణం. మహా భాష్యం పై ఎన్నో వ్యాఖ్యలు వచ్చాయి. అందులో [[భర్తృహరి]] రాసినది ప్రాచీనమైనది.
 
అష్టాధ్యాయి పై అనేక వృత్తులు వచ్చాయి. పాణిని మేన మామ ''వ్యాడి'' అనే ఆయన వ్యాడి సంగ్రహం అనే పేర వృత్తి రాశాడు. [[విక్రమార్కుడు|విక్రమార్కు]]ని ఆస్థానంలో ఉన్న వరరుచి ఇంకో వృత్తి రాశాడు. జయాదిత్యుడు, [[వామనుడు]] కలిసి రాసిన వృత్తికి ''కాశికా వ్రుత్తి'' అని పేరు. ఇదీ గొప్ప పేరు పొందినదే. వీరిద్దరూ [[కాశీ]]లో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది. అతి ప్రధాన వృత్తిగా కాశికా వృత్తికి పేరుంది. దీని తర్వాత చెప్పుకో తగ్గది భర్తృహరి’ అనే పేరుతో పిలువ బడే ఎనిమిదో శతాబ్దానికి చెందిన బౌద్ధ పండితుడు విమల మతి రాసిన భాగ వృత్తి. 16 వ శతాబ్దం వాడైన అప్పయ్య దీక్షితులు సూత్ర ప్రకాశిక అనే వృత్తి రాశాడు. [[దయానంద సరస్వతి]] అష్టాధ్యాయీ భాష్యం అనే ప్రసిద్ధ గ్రంథం రాసి సుసంపన్నం చేశాడు.
"https://te.wikipedia.org/wiki/పాణిని" నుండి వెలికితీశారు