రాబర్టు క్లైవు- వారన్ హేస్టింగ్సుల రాజ్యతంత్రములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →రాబర్టు క్లైవు కుతంత్రములు: clean up, replaced: చక్రవర్తి → చక్రవర్తి |
చి clean up, typos fixed: మే 1689 → 1689 మే, లో → లో , బందువు → బంధువు (2), , → , |
||
పంక్తి 11:
తదుపరి తనను సింహాసనాధీశుడుగా చేసినందుకు కృతజ్ఞతాపూర్వకముగా రాబర్టుక్లైవుకు మీర్ జాఫర్ వంగరాష్ట్ర రాజనిధులనుండి బహిరంగముగా సైనిక సహాయ ఖర్చుల క్రిందనూ, తమ స్థావరం ఆక్రమించిన కాలంలో వచ్చిన ఆర్థిక నష్టము తీర్చుటకునూ దాదాపుగా 21.5 లక్షల రూపాయలకు పైగా నగదు రూపములోనే కాక ఇంకా 24 పరగణాల జాగీరులు కూడా ముట్టచెప్పాడు. (సెలక్టు కమిటీ వారి అంచనా 12.5 లక్షలు మాత్రమే). అదేకాక చాటుగా క్లైవుకూ అతని సిబ్బందికీ కూడా చాల నిధులను అప్పచెప్పాడు. అంతేకాక, బ్రిటిష్ వారి వ్యాపారమునకు సుంకరహితదిగుమతులకు అనుగ్రహ పత్రము జారీచేశాడు. సురాజ్ ఉద్దౌలా ఓడిపోయి సంధి చేసుకున్న వెంటనే రాబర్టుక్లైవు సరాసరి కార్యాచరణ చేపట్టి అతనినే నవాబుగా వుంచియుండిన యడల బ్రిటిష్ వారికి వచ్చే లబ్ధి కంటే మీర్ జఫర్ ను [[కీలుబొమ్మ]] నవాబుగా సింహాసనాధీశుడు చేయుట వల్ల అనేక రెట్లు లాభం కలగటమేకాక తదుపరి రాజ్యతంత్రాలకు అవరోధములు తొలగిపోయినవి. మధ్యవర్తి జగదీశ్ సేథ్, ఓమిచంద్ లకు రాయబారం చేసి మీర్ జాఫర్ ను స్వామిద్రోహమునకు వప్పించుటకు ఇస్తానన్న ప్రతిఫలం మివ్వకుండా నమ్మక ద్రోహం చేశాడు. అతనికి ఇచ్చిన వప్పంద పత్రములో అడ్మిరల్ వాట్సన్ సాక్షి సంతకం పెట్టుటకు నిరాకరించగా కూటపత్రము సృష్టించడం జరిగిందని చరిత్రలో కనబడుచున్నది. ఆ విషయాన్ని క్లైవు బ్రిటిషు పార్లమెంటులో సమర్ధించుకున్నాడు<ref>{{cite book |title= The Parliamentary history of England from the earliest period to the year 1803, Volume 17|page= 876|url= https://books.google.com/books?id=DLE_AAAAYAAJ&pg=PT457|author1= Cobbett|first1= William|last2= Hansard|first2= Thomas Curson|last3= Parliament|first3= Great Britain|last4= Parliament|first4= Scotland|year= 1813}}</ref>. మధ్యవర్తిగా పనిచేసిన వారు, నవాబు సురాజ్ ఉద్దౌలాకు రాజకీయ సలహాదారులు.
మీర్ జాఫర్ విడుదల చేసిన 24 పరగణాల జాగీరు పట్టాలో షరతులను ఉల్లంఘించి తనకు ఇచ్చిన జాగీరు కొలదిరోజులకే క్లైవు కంపెనీవారికి కౌలుకిచ్చి సాలునా నికరాదాయం 20,000 £ ఆర్జించాడు. కృతజ్ఞతతో ముట్టచెప్పిన అనేక లక్షల పౌనుల ధనం, 24 పరగణాల జాగీరు కాకుండా 1765 సంవత్సరములో మీర జాఫర్ చనిపోతూ తనతదనంతరం కుమారుని కనిపెట్టుకొమ్మని క్లైవుకు ఇంకో 70,000 రూపాయలిచ్చాడు. అయినాకూడా మిత్రద్రోహంచేసి వారసుడైన అతని కుమారుడు [[నజముద్దీన్ అలీ ఖాన్]]కు వంగరాష్ట్ర నవాబవుటకు ఇంకో లక్ష రూపాయలు లంచమీయవలసి వచ్చింది. ప్లాసీ యుధ్దానంతరం (1757) ఓడిపోయిన వంగరాష్ట్ర నవాబు సిరాజ్ ఉద్దౌలాకు అధికారములు తొలగించునప్పుడు రాబర్టు క్లైవు వాగ్దానముచేసిన అలవెన్సు 53 లక్షలు. తరువాత వచ్చిన నవాబు (మీర్ జఫర్) కు 41 లక్షలకు తగ్గించాడు. 1765 లో వచ్చిన నాల్గవ నవాబు (నజముద్దీన్ ఖాన్) కు 32 లక్షలకు తగ్గించాడు. 1764 లో బక్సరు యుద్ధానంతరం ఓడిపోయిన మొగల్ చక్రవర్తి రెండవ షా అలం, ఔధ్ నవాబు షూజా ఉద్దౌలా, ఎదురుతిరిగిన వంగరాష్ట్ర నవాబు మీర్ ఖాసీంలు క్లైవు దొరతో చేసుకున్న సంధి వలన వంగరాష్ట్రములో రాజస్యహక్కు (దివానీ) ఇచ్చినట్టుగా చక్రవర్తి ఫరమానాలభించింది. చక్రవర్తిని మనోవర్తిదారుడుగా చేసి సాలునా 26 లక్షలు కప్పముక్రింద ఇచ్చి పేరుకు చక్రవర్తి సింహసనమునందే కూర్చోనిచ్చాడు. అలాగే ఔద్ నవాబును కూడా పూర్తిగా తన వశముచేసుకుని నవాబు సింహాసనంలో కూర్చోనివ్వటం ఆర్బాటమైన ఔదార్యముతో కూడిన కార్యాచరణగా కనబడినా అది రాజ్యతంత్రములో ఒక భాగము. రాబర్టు క్లైవు వంగరాష్ట్రములోసాధించిన పురోగతితో 1765 నే భారతదేశంలో బ్రిటిష్ వలసరాజ్యస్దాపన చేయ గలనని లండన్ లోని కంపెనీ ప్రభువులకు క్లైవు దొర విశ్వాసము తెలిపినట్లుగా చరిత్రలో కనబడుచున్నది.అంతకు
==అదే మార్గములో నడచిన వారన్ హేస్టింగ్సు==
క్లైవు మొదలుపెట్టిన కుతంత్ర పధ్ధతుల ఫలితముగా 1760-1765 మధ్య వంగరాష్ట్రములో కంపెనీ ఉద్యోగుల అక్రమ ఆర్థిక సంపాదన, అవినీతి, ప్రజాపీడనము విషమస్థితిక చేరుకుంటున్నసమయంలో స్థితినియంత్రణకు ప్రయత్నించి విఫలులైన దొరలలో అప్పటి గవర్నరుగానుండిన [[వాన్సటార్టు]] (HENRY VANSITTART) మరియూ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడైన వారన్ హేస్టింగ్సు కూడానుండుట విశేషము. గవర్నరు కాక ముందు చిన్న అధికారిగా 17/04/1762 న వారన్ హేస్టింగ్సు గవర్నరుకు వ్రాసిన లేఖలో కంపెనీ ఉద్యోగులచేయు స్వేఛావ్యాపారములు ఆక్రమ ఆర్థికసముపార్జనలనుగురించి వాపోయాడు. అటువంటి దొర, గవర్నరు అయినాక కుతంత్రముల కార్యాచరణ అవలంబించటం దురదృష్టకరమైన విషయం. 1773 లో గవర్నరు జనరల్ గావచ్చిన తరువాత దొర గారి 12 ఏండ్ల కార్యకాలంలో వంగరాష్ట్ర ప్రజల దుస్థితి మెరుగుపర్చ లేదు. 1774 లో వారన్ హేస్టింగ్సు ప్రవేశపెట్టిన రాజకీయసంస్కరణలు ప్రజల యోగక్షేమము, రాష్ట్రబివృధ్ధికి కాక భ్రిటిష్ వారి ఆదాయము పెంచటానికి ఉపయోగించాయి. రాబర్టు క్లైవు కాలంలో అబ్బిన రాజస్వ అధికారం (దివానీ) తో సిస్తువసూలకు సిబ్బంది ద్వారా బాధ్యతలు వహించకుండా వేలంద్వారా కౌలుకిచ్చి సొమ్ము చేసుకునటం వారన్ హేస్టుంగ్సు దొర చేసిన [[సంస్కరణవాదం|సంస్కరణ]]లలోనొకటి. రైతుల ఆర్థిక స్థితి ఇంకా దిగజారి దుస్థితికిపాలుచేసినవి. కలెక్టర్లకు న్యాయ విచారణ అధికారమిచ్చి నందువల్ల గ్రామ [[పంచాయితీ]] సంస్థ నశించిపోయింది. కలెక్టర్లు నిర్వహించు కోర్టులలో ఆంగ్లేయుల ధర్మశాస్త్రములు అమలుచేయబడినవి. దేశీయ నవాబులను పేరుకు పరిపాలకులుగానుంచి బాధ్యతలు అప్పచెప్పి ప్రత్యామ్నాయముగా పరిపాలన చెలాయించి దేశాదాయము బ్రిటిష్ కంపెనీ పరంచేశాడు. కంపెనీ వారి ఖజానాలు నిండించుటకు ఆర్థిక లభ్దికోసం చేసిన కుతంత్ర కార్యాచరణలు (1) నందకుమారుడునునాతడు వారన్ హేస్టింగ్సు లంచము తీసుకున్నాడని గవర్నింగు కౌన్సిల్ కు ఫిర్యాదు చేశాడు. ఆరోపణను నివృత్తిచేయలేక అతని పై కూట సృష్టి (Forgery) చేశాడను ప్రత్యారోపణ చేసి చివరకి ఉరితీయించాడు. (2) వంగరాష్ట్ర నవాబుకు ఇచ్చే అలవెన్సును 32 లక్షలను తగ్గించి 16 లక్షలు చేశాడు. (3) అలహాబాదు సంధి ప్రకారం మొగల్ చక్రవర్తికి ఇవ్వవలసిన 26 లక్షల కప్పమును పూర్తిగా రద్దుచేసి చక్రవర్తినికూడా ఆర్థికదుస్థితికి పాలుచేశాడు. (4) ఆ సంధి ప్రకారమే చక్రవర్తికిచ్చిన అలహాబాదు, కోరా పరగణాలను తీసేసుకుని అయోధ్య నవాబు షూజా ఉద్దౌలాకిచ్చి 50 లక్షలు అక్రమ సముపార్జన చేశాడు. (5) అయోద్యనవాబు కోరికపై రోహిల్లాలను రోహిల్ఖండునుండి తొలగించుటకు అనవసర యుధ్ధం చేయుటకు సైనిక సహాయానికి ప్రతి ఫలము 2 లక్షలు గడించాడు. (6) అయోధ్యనవాబు [[సూజాఉద్దౌలా]] తరువాత [[అసఫ్ ఉద్దౌలా]] నవాబైనాడు. అతనుకూడ వారన్ హేస్టింగ్సు గుప్పిటలోనున్నవాడే. అతని తల్లి, నాయనమ్మ (అయోధ్య రాణులు) చాల సంపన్నులు. కాశీ రాజు[[ఛైత్ సింగ్]] బ్రిటిష్ కంపెనీవారిపై చేసిన తిరుగుబాటుకుటృలోవీరికి సంబంధమున్నదని వారన్ హేస్టుంగ్సు వారిమీద అక్రమ ఆరోపణలు చేశాడు. చిన్నరాణీ (అసఫ్ ఉద్దౌలా తల్లి) ని చెరసాలలో బంధించి ఆమె వద్దనున్న సొమ్ము12 లక్షలు వసూలు చేయించిన కుతంత్రరాజకీయం వారన్ హేస్టింగ్సు చరిత్రలో మాయని మచ్చ. (7) ఇంకా చేసిన అనవసరపు యధ్ధ సన్నాహాలు అయోధ్యనవాబు పై మహారాష్టలు దాడి చేయుదరని భయంచే అయోధ్య నవాబు కోరిక పై సైనిక సహాయం సంసిధ్దము చేసి యుధ్దం జరుగకపోయిననూ నవాబు దగ్గరనుండి ఆర్థిక ప్రతిఫలం సంపాదించాడు, [[భూటాన్]] రాజు కోరికపై [[టిబెట్టు]]ను ముట్టడించ సంసిధ్దుడగుట. (8) లండన్ లో కంపెనీ ప్రభువుల
==మూలాలు==
|