ఆధునిక పద్ధతుల్లో [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్లోప్రదేశ్]] లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం [[విశాఖపట్టణం|విశాఖపట్టణంలో]] ఏర్పాటుచేశారని పరిశోధకులు భావిస్తున్నారు. [[1886|1886లో]] విశాఖపట్టణంలో మంతిన సూర్యనారాయణమూర్తి ఈ పౌరగ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఆంగ్లభాషా సంస్కృతుల ప్రభావం, ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ప్రజలకు లేకపోయినా స్వంత ప్రేరణపై ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇలా ఆసక్తి ఉత్సాహంతో ఆంధ్రదేశమంతటా ([[బళ్ళారి|బళ్ళారితో]] కలుపుకుని) 1905 నాటికి 20 గ్రంథాలయాలు స్థాపించబడినట్టు లెక్కకువచ్చాయి. పలు ఉద్యమాలు, సాహిత్య సృష్టి వంటి కారణాలతో [[1913]] నాటికి వీటి సంఖ్య 123కు పెరిగింది. ఆపైన గ్రంథాలయోద్యమం ప్రారంభమై ఇతర ఉద్యమాలకు చేయూతనివ్వడమే కాక పలు రంగాల్లో తెలుగువారి చైతన్యానికి చేయూతనిచ్చింది.<ref>ఆంధ్రప్రదేశ్-గ్రంథాలయోద్యమము:పి.నాగభూషణం:1957</ref>