మద్రాస్ ఎ.కన్నన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
ఇతడు తన 8 యేళ్ళ వయసులో [[టైగర్ వరదాచారి]] సంగీత కచేరీకి తొలి సారి మృదంగం వాయించాడు. ఇతడు తన సుదీర్ఘ సంగీత జీవితంలో ఎంతో మంది గాత్ర సంగీత విద్వాంసులకు, వాద్య కళాకారులకు మృదంగ సహకారాన్ని అందించాడు. వీరిలో [[చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై]], [[ద్వారం వెంకటస్వామినాయుడు]], [[హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్]], గోటువాద్యం నారాయణ అయ్యంగార్, వీణ సుబ్బణ్ణ, [[అరియకుడి రామానుజ అయ్యంగార్]], [[చెంబై వైద్యనాథ భాగవతార్]], [[జి.ఎన్.బాలసుబ్రమణియం]], [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], [[మహారాజపురం విశ్వనాథ అయ్యర్]], [[దండపాణి దేశికర్]], [[టి.ఆర్.మహాలింగం]] మొదలైనవారు ఉన్నారు. ఇతడు ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయ విద్వాంసునిగా పనిచేశాడు. ఇతడు అన్నామలై విశ్వవిద్యాలయపు సంగీత కళాశాలలోను, అనేక ప్రైవేటు కళాశాలలోను సంగీత పాఠాలు బోధించాడు.
 
ఇతని శిష్యులలో రామకృష్ణన్, రాజన్, శ్రీనాథ్, సురేష్, దీనదయాళన్ మొదలైన వారు ఇతని సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
 
==పురస్కారాలు, గుర్తింపులు==
"https://te.wikipedia.org/wiki/మద్రాస్_ఎ.కన్నన్" నుండి వెలికితీశారు