చవ్దార్ చెరువు ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{విలీనం|మహాడ్ సత్యాగ్రహం}}
'''[[చవ్దార్ చెరువు ఉద్యమం]]''' డా. [[బి.ఆర్.అంబేద్కర్]] నాయకత్వాన [[1927]], [[మార్చి 20]] న జరిగింది. సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్ పుచ్చుకున్న మహార్ జాతికి చెందిన [[జనం]] మహాద్లో నివాసాలు ఏర్పరచుకున్నారు. మహాద్లో బాబా సాహెబ్ మూడు సూత్రాలను సూచించాడు. అవి -1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగిలి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఆలోచన మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. వ్యవసాయాన్ని కూడా [[వృత్తి]]గా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. ఆ సమయంలోనే [[మహాద్ మునిసిపాలిటీ]] ఒక తీర్మానం చేసింది. `మహాద్ చెరువు సార్వజనికమైనది, దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చు' అని ఈ తీర్మానం సారాంశం. మహాద్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలనే లక్ష్యంతో బాబాసాహెబ్ ముందు నడవగా ఐదువేల మందితో దళిత సమాజం చవ్దార్ చెరువు గట్టుకు చేరుకుంది. బాబాసాహెబ్, ఆ తర్వాత దళిత సమాజం అంతా మంచి నీటిని దోసిట్లోకి తీసుకుని తృప్తిగా తాగి తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతున్న దళితులపై అకస్మాత్తుగా అగ్రవర్ణ గుండాలు దండెత్తి వచ్చి [[లాఠీ]]ల వర్షం కురిపించారు. ఊరంతా తిరుగుతూ కనిపించిన దళిత ప్రతినిధులను కొట్టారు. 1927 జూన్ 6వ తేదిన తొమ్మిది మంది నేరస్థుల్లో ఐదుగురికి కఠిన కారగార శిక్ష పడింది. ఆ తర్వాత అగ్రకులస్తులు చవ్దార్ చెరువును శుద్ధి చేయ్యాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం చవ్దార్ చెరువులోంచి 108 బిందెల నీళ్ళు తీయించారు. ఇంటింటి నుంచి [[పేడ]], గోమూత్రం పోగుచేసి [[పాలు]], [[పెరుగు]]తో సహా బిందెల్లో కలిపారు. మొత్తం వాటన్నింటిని చవ్దార్ చెరువులో పోసి, శుద్ధి అయ్యిందని ప్రకటించారు. అనంతరం ఆగస్టు 4వ తేదీన మహాద్ మున్సిపాలిటీ ఒక కొత్త తీర్మానాన్ని అమోదించి గతంలో ప్రకటించిన తీర్మానాన్ని రద్దుచేసుకుంది. ఈ చర్యను అంబేడ్కర్ వ్యతిరేకించి చవ్దార్ చెరువు నీళ్ళను సనాతులతో సమానంగా అస్పృశ్యులు హక్కుగా పొందేవరకు పోరాడాడు. పుట్టుకరీత్యా అందరూ సమానంగా పుడతారు. వారు చనిపోయేదాకా సమానంగా ఉండాలి' అంటూ తీర్మానించారు.
|