విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
[[1930]] వ సంవత్సరం [[మార్చి 12]] తేదీన గాంధీజీ [[ఉప్పు సత్యాగ్రహం]] ప్రారంభించాడు. ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ [[అలహాబాద్]]లో జవహర్ లాల్ నెహ్రూ, ఉప్పు తయారుచేసే సంఘటనలో విజయలక్ష్మీ, కృష్ణ ఇద్దరూ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అదే సంవత్సరం [[ఏప్రిల్ 14]] వతేదీ జవరల్ లాల్ అరెష్టు అయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా తాత్కాలికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండవలసి వచ్చింది. ఉప్పు సత్యాగ్రహంలో చాలా సమావేశాలలో విజయలక్ష్మీ పండిట్ ఉత్సాహంగా పాల్గొని విరివిగా ఉపన్యాసాలిచ్చింది. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ, ఉత్సరాలూ, [[ఊరేగింపు]]లూ జరిపింది. అన్ని రకాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఎన్నో రకాలుగా ప్రభుత్వం చేత మోసగింపబడే భారతీయులకు తను చేతనైన సహాయం చేయడం ఒక భారత మహిళగా తన కర్తవ్యమని భావించిన విజయలక్ష్మీ పండిట్ ప్రభుత్వాజ్ఞలను గూడా ధిక్కరించి ఉద్యమ ప్రచారము చేసింది.
 
జూన్ లో తండ్రితో కలిసి [[బొంబాయి]] వెళ్ళినపుడు ప్రభుత్వం మోతీలాల్ నూ, కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేసింది. అయినా కాంగ్రెస్ లో ఎప్పటి కప్పుడు సభ్యులు చేరుతూనే ఉన్నారు. ఇది జరిగిన కొద్దికాలానికి జవహర్ లాల్ నెహ్రూ ను రంజిత్ పండిట్ ను ప్రభుత్వం అరెష్టు చేసి చైనీ సెంట్రల్ జైలుకు పంపింది. మోతీలా అనారోగ్యంగా ఉండటం వలన ఆయనను విడుదల చేసింది. అదే సమయంల్ జవహర్ లాల్ కూడా విడుదలయ్యాడు. మోతీలాల్ [[అలహాబాద్]] వచ్చినప్పటి నుండి విజయలక్ష్మీ, కృష్ణ వీరంతా సహాయ నిరాకరణోద్యమంలో పనిచేస్తూనే ఉన్నారు. నైనీ జైల్లో పండిట్ తో పాటు మదన్ మోహన్ మాలవ్య ఉండేవాడు. రంజిత్ వద్ద మాలవ్య [[జర్మనీ]] భాష నేర్చుకున్నాడు. రంజిత్ [[జర్మనీ]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]], [[సంస్కృతం]], [[ఇంగ్లీషు]] భాషల్లో రంజిత్ మంచి పండితుడు.
 
మోతీలాల్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఆయనకు [[లక్నో]]లో జవహర్ లాల్, విజయలక్ష్మి, [[కమలా నెహ్రూ]] లు అంతా సేవలు చేస్తూనే ఉన్నారు. కానీ [[1931]] వ సంవత్సరం [[ఫిబ్రవరి 6]] వ తేదీన మోతీలాల్ మరణించాడు.ఆ సంవత్సరం [[కరాచీ]]లో జరిగిన [[కాంగ్రెస్]] సభకు విజయలక్ష్మీ వెళ్ళలేదు. ఇర్విన్ సంప్రదింపులు వ్యర్థమై గాంధీజీ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సు కు వెళ్ళి [[లండన్]] నుంచి వస్తూంటే [[బొంబాయి]] వెళ్ళి ఆయనకు స్వాగతము చెప్పాలనుకున్న జవహర్ లాల్ ను అరెష్టు చేశారు. ఆ తరువాత బాపూజీ, పటేలు కూడా అరెష్టయ్యారు. ఈ ఉధ్యమంలో విజయలక్ష్మీ పండిట్, కమల, స్వరూపరాణి మొదలైన వారంతా ముమ్మరంగా ప్రచారం చేశారు.
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు