రాణి సాయపనేని గోవిందమాంబా దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 11:
==యుద్ధము==
 
మీర్ జుంలా అను పారశీకుడు [[గోలకొండ]] సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగాడు. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుంలా గండికోటపై దండెత్తాడు. పలు దినములుగా భీకర యుద్ధము జరిగినను కోట వశముకాలేదు. గండికోట అప్పగించినచో గుత్తి దుర్గమునకు అధిపతి చేస్తానని జుంలా బేరసారాలు చేశాడు. కాని తిమ్మా నాయుడు అంగీకరించలేదు. వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ [[ఫ్రెంచి|ఫ్రెంచ్]] ఫిరంగుల దాడిలో మరణించారు. తిమ్మానాయుని బావమరిది నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాశాడు.
 
==పోరాటము==
 
చిన తిమ్మానాయుని చెల్లెలు గోవిందమ్మ సతీసహగమనము చేయకుండా, అన్న వారిస్తున్నా వినకుండా కాసెగట్టి, అశ్వారూఢయై తురుష్క, [[ఫ్రెంచ్]] సైనికులతో తలపడింది. [[భర్త]] మరణమునకు కారకుడైన అబ్దుల్ నబీ అను వానిని వెదికి వేటాడి సంహరిస్తుంది. అదే సమయములో నబీ వేసిన కత్తి వేటుకు కూలి వీరమరణము పొందింది. కోటలో వందలాది స్త్రీలు అగ్నిప్రవేశము చేస్తారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకుతారు. హతాశుడైన చినతిమ్మ రాయబారమునకు తలొగ్గక తప్పలేదు. [[గండికోట]]కు బదులుగా గుత్తి కోటను అప్పగించుట ఒప్పందము. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషము ఇప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి అధిపతినిచేస్తూ ఫర్మాను ఇవ్వబడింది. మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువులకప్పగించి రాజ్యము దాటిస్తాడు. నాయునికి విషప్రభావము వల్ల మరణము ప్రాప్తించింది<ref>గండికోట యుద్ధం, [[కొసరాజు రాఘవయ్య]], 1977, కమ్మజన సేవాసమితి, [[గుంటూరు]]</ref>.
 
గండికోట సంరక్షణకై కత్తిబట్టి వీరోచితముగా పోరాడి అసువులు బాసిన వీర వనిత గోవిందమ్మ. [[తెలుగు]] చరిత్ర పుటల కెక్కని అభాగ్యురాలు కూడా.