ఆధునిక యుగములో వెలసిన పద్మ పురాణములలో మొదటిది [[వేలూరి శివరామ శాస్త్రి]] గారి ఆముద్రిత పద్మ పురాణము.రెండవది పిసుపాటి[[పిశుపాటి చిదంబర శాస్త్రి]] చిదంబరశాస్త్రి గారి శ్రీమదాంధ్ర పద్మపురాణము. శివరామ శాస్త్రిగారును, చిదంబర శాస్త్రిగారును ఇంచుమించు సమాన వయస్కులు. ఇరువురును శతావధానులు.వేలూరి వారి పద్మపురాణము సమగ్రముగా లభించటంలేదు. ఆది ఖండము, భూమి ఖండము, బ్రహ్మ ఖండము అను మూడు ఖండములు మాత్రమే కలవు. ఇక పిసుపాటివారు పద్మపురాణము మాత్రమే తెలుగులో లభించుచున్న సమగ్ర గ్రంధము.విశేషమగు వ్యయప్రయాసలకోర్చి ఈమహాగ్రంధమును రసజ్ఞుల సహాయసహకారములతో నాలుగు సంపుటములుగా ముద్రించి తెలుగువారికి సమర్పించి ధన్యులైన వారు కవిసోదరులైన సుబ్రహ్మణ్యశాస్త్రిగారు- విశ్వేశ్వరశాస్త్రి గారు.