మహిళావరణం: కూర్పుల మధ్య తేడాలు

మహిళావరణం పుస్తకం గురించి నేను ఎనిమిదేళ్ళ క్రితం రాసిన బ్లాగు టపాల ఆధారంగా ఇక్కడ అందులోని వారి జాబితాలు చేర్చాను. కొంతవరకూ సంబంధిత వికీ లంకెలు జతచేశాను. మిగితా వారివి కూడా వెదికి చేర్చాలి. అలాగే, కొంతమంది గురించి వారు జీవించే ఉన్నారా? మరణిస్తే ఎప్పుడు? అన్న వివరాలు సేకరించాలి.
(తేడా లేదు)

18:31, 1 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

"మహిళావరణం: Womanscape" అన్నది ఓల్గా, వసంత కణ్ణబీరన్, కల్పన కణ్ణబీరన్ ల సంపాదకత్వంలో 2001 లో వెలువడిన ఒక తెలుగు-ఆంగ్ల ద్విభాషా పుస్తకం. గత శతాబ్దంలో జీవించిన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో వివిధ రంగాలలో కృషి చేసిన, స్త్రీల చరిత్ర చిత్రణల సంకలనం. దీనిని "అస్మిత రిసోర్స్ సెంటర్ వర్ వుమెన్" అన్న సంస్థ వారు ప్రచురించారు[1].

పుస్తకం వివరాలు[2]

ఇందులో ఈ క్రింద పేర్కొనబడిన వారి గురించి తెలుగు-ఆంగ్లం రెండు భాషలలోనూ పరిచయ వ్యాసాలు ఉన్నాయి.

  1. కందుకూరి రాజ్యలక్ష్మి (1851-1910) : స్త్రీ విద్య, వితంతు వివాహం, సంఘసంస్కరణ కోసం కృషి చేశారు. ఈమె కందుకూరి వీరేశలింగం పంతులు భార్య.మి
  2. సరోజినీ నాయుడు (1873-1949) : "భారతకోకిల" గా పిలవబడే ఈమె ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు,కవయిత్రి.
  3. భండారు అచ్చమాంబ (1874-1905): తెలుగులో తొలి కథా రచయిత్రి.
  4. బెంగుళూరు నాగరత్నము (1878-1952): కర్ణాటక సంగీతంలో పేరెన్నిక గన్న గాయని.
  5. మార్గరెట్ కజిన్స్ (1878-1954) : ఈమె ఐర్లండు నుండి భారతదేశం వచ్చి స్వాతంత్ర్యోద్యమంలో, మహిళోద్యమంలో పాల్గొనింది. రచయిత్రి.
  6. దువ్వూరి సుబ్బమ్మ (1880-1964): స్వాతంత్ర్య సమరయోధురాలు.
  7. ఉన్నవ లక్ష్మీబాయి. (1882-1956) : సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు.
  8. సుఘ్రా హుమాయున్ మిర్జా (1882-1958): కవయిత్రి, రచయిత్రి, పత్రికా సంపాదకురాలు.
  9. వింజమూరి వెంకటరత్నమ్మ (1888-1951): రచయిత్రి, పత్రికా సంపాదకురాలు.
  10. ఆచంట రుక్మిణి (1891-1951): జాతీయోద్యమంలోనూ, పరిపాలన రంగంలోనూ, దేశీ వైద్య విద్యను అభివృద్ధి చేయడంలోనూ కృషి చేసిందిర్ర.
  11. కనుపర్తి వరలక్ష్మమ్మ (1896-1960): రచయిత్రి.
  12. డాక్టర్ రంగనాయకమ్మ (1898-1940): వైద్యురాలు. సంఘసేవకురాలిగా, జాతీయోద్యమ కార్యకర్తగా పనిచేసింది. స్త్రీల సమస్యల గురించి కృషి చేసి, “రక్షణ మందిరం” స్థాపించి ఎందరో స్త్రీలకి బ్రతుకు తెరువు చూపించింది.
  13. మెల్లీ సోలింగర్ (1898-1965): స్విట్జర్లాండుకు చెందిన సామాజిక కార్యకర్త. భారతదేశపు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనింది. ఉప్పల లక్ష్మణరావుని వివాహమాడింది.
  14. మార్సెలిన్ లిమా (1899-1984): సికిందరాబాదు ప్రాంతపు తొలితరం మహిళా వైద్యురాలు.
  15. కాన్స్టన్స్ గిబ్స్ (1900-1984): ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.
  16. పద్మజా నాయుడు (1900-1975): రాజకీయ నాయకురాలు. హైదరాబాదులో భారతీయ జాతీయ కాంగ్రెసు శాఖ స్థాపకుల్లో ఒకరు. సరోజినీ నాయుడు కుమార్తె.
  17. శాంతాబాయి కిర్లోస్కర్ (1901-1986): హైదరాబాదు ప్రాంతంలోని తొలితరం మహిళా డాక్టర్లలో ఒకరు. ఈ ప్రాంతంలో తొలి ప్రసూతి ఆస్పత్రి నిర్మించింది.
  18. మాసుమా బేగం (1901-1990): సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తొలి మహిళా మంత్రి.
  19. దాసరి రామతిలకం (1905-1952): సంగీత, నృత్య కళాకారిణి. రంగస్థల నటి.
  20. కొమర్రాజు అచ్చమాంబ (1906-1964): వైద్యురాలు, రాజకీయ నాయకురాలు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కుమార్తె.
  21. దామెర్ల సత్యవాణి (1907-1992): చిత్రకారిణి. దామెర్ల రామారావు భార్య.
  22. సురభి కమలాబాయి (1908-1971): రంగస్థల, సినిమా నటి.
  23. కొమ్మూరి పద్మావతీదేవి (1908-1970): ప్రముఖ నాటకరంగ కళాకారిణి.
  24. దుర్గాబాయి దేశ్‌ముఖ్ (1909-1981): జాతీయ నాయకురాలు, సంఘ సేవకురాలు.
  25. ప్రేమ మాసిలామణి నాయుడు (1909-1995): వృత్తిరీత్యా వైద్యురాలు. హైదరబాదు విక్టోరియా జెనానా ఆసుపత్రి అభివృద్ధికి విశేష కృషి చేసింది.
  26. సరిదె మాణిక్యమ్మ (1910-200?): సంగీత నాట్య కళాకారిణి. 1990లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
  27. సంగం లక్ష్మీబాయి (1910-1979) : స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు, సాంఘిక కార్యకర్త. స్వతంత్ర్యానంతరం హైదరాబాదు శాసన సభ్యురాలిగా, విద్యా శాఖా మంత్రిగా పనిచేసింది. “ఇందిరా సేవాసదనం” స్థాపించింది.
  28. జానంపల్లి కుముదినీ దేవి (1911 – 2009) : రాజకీయ నాయకురాలు, సంఘసేవకురాలు, హైదరాబాదు మొదటి మహిళా మేయరు.
  29. పసుపులేటి కన్నాంబ (1912-1964) : ప్రముఖ నటి, గాయని. రాజరాజేశ్వరీ నాట్య మండలి, రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపకురాలు.
  30. సరస్వతి గోరా (1912-2006): సామాజిక ఉద్యమకారిణి, నాస్తిక కేంద్రం నాయకురాలు.
  31. జమాలున్నిసా బాజి (1913-2012) : విప్లవ నాయకురాలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త.
  32. సూర్యదేవర రాజ్యలక్ష్మి (1914-2010): సామాజిక ఉద్యమకారిణి. ఆంధ్ర రాష్ట్రోద్యమం సమయంలో “తెలుగుదేశం” అన్న పత్రిక కూడా నడిపింది.
  33. జె. ఈశ్వరీబాయి (1918-1991): సామాజిక ఉద్యమకారిణి.
  34. జ్ఞాన కుమారీ హెడా (1918-2008): రాజకీయ నాయకురాలు, సాంఘిక కార్యకర్త.
  35. కొమురం సోంబాయి (1918-1994): గిరిజన హక్కుల కార్యకర్త. కొమురం భీమ్ సతీమణి.
  36. కంచర్ల సుగుణమణి (1919 –2017 ): దుర్గాభాయి దేశ్‌ముఖ్ సహచరురాలిగా, సంఘ సేవిక గా ప్రసిద్ధురాలు.
  37. చిట్యాల ఐలమ్మ (1919-1985): తెలాంగాణ పోరాట యోధురాలు.
  38. వింజమూరి అనసూయ (1920-2019): ప్రముఖ జానపద కళాకారిణి. గాయని. సంగీతజ్ఞురాలు. వింజమూరి వెంకటరత్నమ్మ కుమార్తె.
  39. బ్రిజ్‌రాణి గౌడ్ (1920 –? ) : కమ్యూనిస్టు నాయకురాలు.
  40. కొండపల్లి కోటేశ్వరమ్మ: కమ్యూనిస్టు నాయకురాలు, రచయిత్రి. వీరి భర్త కొండపల్లి సీతారామయ్య.
  41. గ్లాడిస్ లోబో (1921-2009): బర్మా నుండి ఇండియా వలస వచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడిన వైద్యురాలు. న
  42. చిత్తజల్లు కాంచనమాల (1921-1981) : తెలుగు సినిమాల్లో తొలి గ్లామర్ హీరోయిన్.
  43. శ్రీరాజ్యం సిన్హా (1923 –? ) : సోషలిస్టు నాయకురాలు, రచయిత్రి, సంపాదకురాలు.
  44. వింజమూరి సీతాదేవి (1924-2016): జానపద గాయని. వింజమూరి వెంకటరత్నమ్మ కుమార్తె. వింజమూరి అనసూయ సోదరి.
  45. మల్లాది సుబ్బమ్మ (1924-2014): సామాజిక ఉద్యమకారిణి. రచయిత్రి.
  46. జీనత్ సాజిదా (1924 - ?): ఉర్దూ రచయిత్రి. తెలుగు సాహిత్య చరిత్రను ఉర్దూలో రాసింది. తెలుగు నవలలను ఉర్దూలోకి అనువదించింది. ఇవి కాక కథలు, ఇతర రచనలు చేసింది.ది
  47. మోటూరి ఉదయం (1924-2002) : సామాజిక ఉద్యమకారిణి. రచయిత్రి.
  48. బానో తాహెరా సయీద్ (1924-2001): ఉర్దూ, పర్షియన్, ఆంగ్ల భాషల్లో రచనలు చేసిన కవయిత్రి.
  49. సూర్యకాంతం (1924-1996): ప్రముఖ సినీనటి.
  50. భానుమతీ రామకృష్ణ (1925-2005): బహుముఖ ప్రజ్ఞాశాలి - సినీనటి, దర్శకురాలు, నిర్మాత, మరియు రచయిత్రి.
  51. శాంత రామేశ్వరరావు (1925-?): హైదరాబాదుకు చెందిన విద్యావేత్త, రచయిత్రి. విద్యారణ్య పాఠశాల స్థాపకురాలు.
  52. అబ్బూరి కమలాదేవి (1925): నాటకరంగ కళాకారిణి. పురుష పాత్రలకి ప్రసిద్ధి.
  53. వనజా అయ్యంగార్ (1926-1999): గణిత శాస్త్రంలో ప్రొఫెసర్. కోఠీ మహిళా కళాశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసింది.
  54. అంజలీదేవి (1927-2014): సినీనటి, "అంజలీ పిక్చర్స్" సంస్థ సహ-అధిపతి. నిర్మాత.
  55. సరోజిని రేగాని (1927-2001): చరిత్రకారిణి, రచయిత్రి. “ఉస్మానియా జర్నల్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్” కు వ్యవస్థాపక సంపాదకురాలు.
  56. యెరువ ఇగ్నేషియస్ (1928-):గుంటూరు జిల్లాకు చెందిన విద్యావేత్త.
  57. టి.ఎన్.సదాలక్ష్మి (1928-2004) : బలహీన వర్గాల అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసిన రాజకీయ నాయకురాలు.
  58. స్నేహలత భూపాల్ (1928 - ?): సామాజిక కార్యకర్త. వ్యవసాయ రంగంలో డైరీ నిర్వహణ, ద్రాక్ష తోటల నిర్వహణ ఇలాగ పాడిపరిశ్రమలో విశేష కృషి చేసింది.
  59. రావు బాలసరస్వతీ దేవి (1929-): ప్రముఖ గాయని.
  60. కె. అమరేశ్వరి (1929-2009): ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా న్యాయమూర్తి.
  61. మాలతీ చందూర్ (1930-2013): ప్రముఖ రచయిత్రి.
  62. మల్లు స్వరాజ్యం (1930 – ) : కమ్యూనిస్టు నాయకురాలు.
  63. తెన్నేటి హేమలత (1931-1997) : ప్రముఖ రచయిత్రి.
  64. మాలతి పద్మనాభరావు (1932-?): సంగీత విద్వాంసురాలు.
  65. వాసిరెడ్డి సీతాదేవి (1932-2007): తెలుగు రచయిత్రి.
  66. అబ్బూరి ఛాయాదేవి (1933-2019): రచయిత్రి, పత్రికా సంపాదకురాలు.
  67. చిందు ఎల్లమ్మ (1933-2005): “చిందు భాగవతం” జానపదరీతికి చెందిన కళాకారిణి.
  68. వినోదిని రెడ్డి (1934-): వైద్య శాస్త్రవేత్త. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు మొదటి మహిళా డైరెక్టర్.
  69. వి. ఎస్. రమాదేవి (1934-2013): భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు. రచయిత్రి.
  70. మెహతాబ్ ఎస్. బామ్జీ (1934-): న్యుట్రిషనల్ బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త.
  71. శారదా శ్రీనివాసన్ (1935 – ): రేడియో కళాకారిణి.
  72. ద్వారం మంగతాయారు (1935 – ): ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు. సంగీత విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు కుమార్తె.
  73. పి.సుశీల (1936-): ప్రముఖ సినీ గాయని.
  74. తురగా జానకీరాణి (1936-2014): తెలుగు రచయిత్రి. రేడియో కళాకారిణి.
  75. జిలానీ బానో (1936-): ఉర్దూ కథా, నవలా రచయిత్రి. ఆమె కథలు పధ్నాలుగు భారతీయ భాషల్లోకి అనువదితమయ్యాయి.
  76. హేమలతా లవణం (1937 -2008): సాంఘికోద్యమ నాయకురాలు. రచయిత్రి. జాషువా కుమార్తె.
  77. సావిత్రి (నటి) (1937-1981) : తెలుగు సినీ నటి.
  78. ఎస్. జానకి (1938-): సినీ గాయని.
  79. శ్రీరంగం గోపాలరత్నం (1939-1993): ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు.
  80. రమ మెల్కోటే (1940): రచయిత్రి, అధ్యాపకురాలు.
  81. డఫ్ని ఎం. డి రెబెల్లో (1941-): ఐ.ఎ.ఎస్ అధికారిణి.
  82. మాలినీ రాజూర్కర్ (1941) : హిందుస్తానీ గాయని.
  83. ఉజ్రా బిల్‌గ్రామి (1943): “దస్తకార్ ఆంధ్ర”ను ప్రారంభించారు.
  84. కొలకలూరి స్వరూపరాణి (1943): రచయిత్రి. భారతీయ కవి సంప్రదాయానికి విరుద్ధంగా చంద్రుణ్ణి స్త్రీగా, రాహువుని చంద్రుని భర్తగా చేసి “చంద్రగ్రహణం” అన్న పద్య కావ్యం రాసింది.
  85. సుజీ తారు (1943): ఉగాండాకు చెందిన సుజీ తారు ఉద్యోగరిత్యా హైదరాబాదులోని సీఫిల్ (CIEFL) లో స్థిరపడి, స్త్రీ సమస్యల గురించి, హైదరాబాదులో సోషలిస్టు ఫెమినిస్టు దృక్పథం పరిచయం చేయడంలోనూ కృషి చేశారు. పరిశోధకురాలు, రచయిత్రి.
  86. శారద (1945): ప్రముఖ సినీ నటి. తన నటనకు గాను “ఊర్వశి” అవార్డు మూడుసార్లు అందుకున్నారు.
  87. పంచాది నిర్మల (1947-1969): శ్రీకాకుళోద్యమంలో ప్రధాన భూమిక వహించిన నాయకురాలు.
  88. చౌదరి సంపూర్ణమ్మ (1948): శ్రీకాకుళ గిరిజనోద్యమంలో పనిచేసిన ప్రముఖ నాయకుల్లో ఒకరు.
  89. లంక అన్నపూర్ణదేవి (1950): తనపాట తనే పాడుకుంటూ కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చే నర్తకి, గాయని. నాట్యశాస్త్రంలో పరిశోధన చేసి, అతి చిన్నవయసులో సిద్ధేంద్ర కళాక్షేత్రం గుడివాడ శాఖకు ప్రిన్సిపాల్ గా పనిచేసింది.
  90. ఐ. రోశమ్మ (1950): 1992లో నెల్లూరులో జరిగిన సారా వ్యతిరేకోద్యమంలో నాయకురాలు.
  91. శాంతా సిన్హా (1951): రామన్ మెగసెసే అవార్డు గ్రహీత.
  92. పావలా శ్యామల (1951): “పావలా” నాటకం ద్వారా పేరు తెచ్చుకున్న సినీ, టీవీ నటి.
  93. కామేశ్వరి జంధ్యాల (1951): శ్త్రీ శక్తి సమాఖ్యలోనూ, మహిళా సమాఖ్యలోనూ పని చేశారు.
  94. జస్బీర్ కౌర్ (1952) : గాయని, బహుభాషా ప్రవీణురాలు.
  95. కె. లలిత (1953): రచయిత్రి, పరిశోధకురాలు. “విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా” పుస్తకాల సంపాదకులలో ఒకరు.రు
  96. గీతా రామస్వామి (1953): హైదరాబాదు బుక్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.
  97. ఉమాదేవి (1953) : మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ, బాలికల అభ్యున్నతి కోసం కృషి చేసారు.
  98. వేమన వసంతలక్ష్మి (1953) : రచయిత్రి, పాత్రికేయురాలు.
  99. కొండవీటి సత్యవతి (1954): భూమిక పత్రిక సంపాదకురాలు.
  100. శోభానాయుడు : ప్రముఖ నర్తకి. “కూచిపూడి ఆర్ట్స్ అకాడెమీ ఆఫ్ హైదరాబాదు” స్థాపకురాలు.
  101. యు. వింధ్య (1955): పౌరహక్కుల కార్యకర్త.
  102. జమీలా నిషాత్ (1935): ఉర్దూ స్త్రీవాద రచయిత్రి.
  103. ప్రతిభా భారతి (1956): రాజకీయ నాయకురాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాసనసభకు మొదటి మహిళా స్పీకర్.
  104. గొర్రె సత్యవతి (1956): మహిళా సంక్షేమ నాయకురాలు.
  105. అరుణ ఎం.బహుగుణ (1957): ఆంధ్రప్రదేశ్ లో మొదటి మహిళా ఐ.పీ.యస్ అధికారిణి.
  106. సి.పుణ్యవతి (1957): వామపక్ష నాయకురాలు.
  107. కొండేపూడి నిర్మల (1958): ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. వృత్తిరిత్యా జర్నలిస్టు.
  108. శోభాలత (1958): సినీరంగంలో మేకప్ కళాకారిణి.
  109. రంగవల్లి (1959-1999): సి.పి.ఐ (ఎం.ఎల్) నాయకురాలు.
  110. ఫాతిమా బీ (1960): “కాల్వ” (కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం) సర్పంచిగా పని చేసి, గ్రామాభివృద్ధికి చేసిన కృషికిగాను 1998లో యూ.ఎన్.డీ.పీ. వారి నుండి అవార్డు అందుకున్నారు.
  111. విమల (1960): రచయిత్రి. రాజకీయ సాంఘిక ఉద్యమకర్త.
  112. భాగ్యలక్ష్మి (1962-1992): విప్లవ నాయకురాలు. పోలీసుల ఎన్‌కౌంటర్ లో మరణించింది.
  113. మున్నంగి సువార్త (1963):
  114. బొర్లం స్వరూప (1966-1992): పీపుల్స్ వార్ నాయకురాలు. జ్యోతక్కగా ప్రసిద్ధి చెందినది.
  115. పాటిబండ్ల రజని (1966): ప్రముఖ స్త్రీవాద కవయిత్రి.
  116. పూర్ణిమా రావు (1967) : ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి.
  117. కరణం మల్లీశ్వరి (1975): ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఒలింపిక్ పతకం , రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత.
  118. కోనేరు హంపి (1987): ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.

మూలాలు

  1. "Books – Kalpana Kannabiran" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-04-01.
  2. "Mahilavaranam – sowmyawrites …". sowmyawrites .... (in ఇంగ్లీష్). Retrieved 2021-04-01.