పాల్కురికి సోమనాథుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 7:
* [[బసవ పురాణం]]<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.386165 భారత డిజిటల్ లైబ్రరీలో ద్విపద బసవ పురాణము పూర్తి పుస్తకం.]</ref>
* [[వృషాధిప శతకం]]
* [[చతుర్వేద
* [[పండితారాధ్య చరిత్ర]]
* చెన్నమల్లు సీసాలు, గద్యలు, ఉదాహరణలు, పంచకాలు, అష్టకాలు, స్తవాలు
*బసవ రగడ
*చెన్నమల్లు సీసములు
*బసవోదాహరణం
*బసవాష్టకం
*బసవ
*పంచప్రకార గద్య
*నమస్కారగద్య
పంక్తి 22:
*సద్గురు రగడ
*చెన్న బసవస్త్రోత్ర రగడ
*సోమనాథ
*మల్లమదేవి
*భక్తస్తవం
; సంస్కృతంలో
పంక్తి 44:
తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవి నన్నయభట్టే అయినప్పటికీ తొలి తెలుగుకవి పాల్కురికి సోమనాధుడు. నన్నయ వాడిన ఛందస్సులు, భాషావైభవం, ఇతివృత్తం, పద్యశిల్పం అన్నీ సంస్కృతం నుండి స్వీకరించినవే..! పైగా భారతం అనువాద కావ్యం. సోమనాథుడు అట్లాకాదు. తెలుగు ఇతివృత్తాలు, తెలుగు ఛందస్సు, తెలుగు నుడికారం, జాను తెనుగు స్వీకరించి కావ్య రచన చేశాడు. అందుకే సోమనాథుడు తొలి ‘తెలుగు’ కవి.
సాహిత్యంలో తెలుగు భాషా పదాల వాడకం శివకవి యుగంలో పెరిగింది. ముఖ్యంగా సోమనాధుడు అచ్చ తెలుగు పదాలను, తెలుగు ఛందస్సును విరివిగా వినియోగించాడు. "[[రగడ]]" అనే ఛందోరీతి ఇతనే ప్రారంభించాడు. ఇతడు మొదలుపెట్టిన [[రగడ]]ను "బసవ రగడ" అంటారు. ద్విపద, రగడలే కాకుండా సోమనాధుడు ఇంకా [[సీసము (పద్యం)|సీసము]], [[త్రిభంగి]], [[తరువోజ]], [[క్రౌంచ పదము]], [[వన మయూరము]], [[చతుర్విధ కందము]], [[త్రిపాస కందము]] వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు.
సోమనాథుడు సంస్కృతాంధ్ర భాషా విశారదుడే కాక ప్రాకృత తమిళ కన్నడ మహారాష్ట్రాది బహుభాషా కోవిదుడు. ద్వైతాద్వైత, విశిష్టాద్వైత, బౌద్ధజైనాది సమస్త దర్శనముల సారమును గ్రహించినవాడు. ఇంతటి పండితకవి మొత్తము తెలుగు భాషలోనే మరొకడు లేడంటే అందులో ఆశ్చర్యం లేదు. అంతేకాక ఇతడు సమస్త కవితా సంప్రదాయములూ తెలిసినవాడు. దేశకాల పాత్రములను గుర్తెరిగినవాడు. ప్రజల భాషలో ప్రజల కొరకు ప్రజల ఇతివృత్తాన్ని ప్రచారం చేయవలసిన అవసరం గ్రహించినవాడు. అందుకే నన్నయ్య మనకు అక్షరభిక్షను పెట్టిన ఆదికవి. అయితే పాల్కురికి తొలి తెలుగు కవి. ఐహికాధ్యాత్మికానుసంధానం గావించిన మొట్టమొదటి ప్రజాకవి.
|