నర్సంపేట పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

నర్సంపేట్ పురపాలక సంఘం
(తేడా లేదు)

08:09, 7 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

నర్సంపేట్ పురపాలకసంఘంతెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా కు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ, నర్సంపేట పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం వరంగల్ లోకసభ నియోజకవర్గం లోని నర్సంపేట్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[1]

చరిత్ర

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న నర్సంపేట్, 2013, మార్చి 22న పురపాలక సంఘంగా ఏర్పడింది. మరికొన్ని గ్రామ పంచాయతీలను కలిపి నర్సంపేట పురపాలకసంఘంగా ఏర్పాటుచేశారు.

పౌర పరిపాలన

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 10 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు

  1. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 31 March 2021.

వెలుపలి లంకెలు