ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==2008 ఉప ఎన్నికలు==
పి.జనార్థన్ రెడ్డి మరణం వలన జరిగిన ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి సమీప [[లోక్‌సత్తా పార్టీ]]కి చెందిన అభ్యర్థి కె.శ్రీనివాస్ రావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ స్థానం నుంచి ముందుగా కుదిరిన అవగాహన మేరకు [[తెలుగుదేశం పార్టీ]] పోటీకి దిగలేదు. <ref> ఈనాడు దినపత్రిక, తేది జూన్ 2, 2008 </ref> విష్ణువర్థన్ రెడ్డి 2,54,676 ఓట్లు సాధించగా, శ్రీనివాస్ రావు 58,407 ఓట్లు పొందినాడు. [[తెలంగాణా రాష్ట్ర సమితి]]కి చెందిన అభ్యర్థి అరీఫుద్దీన్ 54,134 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.
==నియోజకవర్గ ప్రముఖులు==
;పి.జనార్థన్ రెడ్డి:
:ఖైరతాబాదు నియోజకవర్గంలో పి.జనార్థన్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా పేరుగాంచినాడు. మొత్తం 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొంది పార్టీలో ప్రముఖ స్థానం పొందినాడు. [[1978]]లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టగా, [[1983]]లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో ఓడిపోయాడు. ఆ తరువాత [[1985]], [[1989]] మరియు [[1994]]లలో వరుసగా 3 సార్లు విజయం సాధించాడు. [[1999]]లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయరామారావు చేతిలో ఒడిపోగా, 2004లో విజయరామారావును ఓడించి మళ్ళీ తన స్థానాన్ని చేజిక్కించుకొని మరణించే వరకు నియోజకవర్గానికి తన సేవలందించాడు. 2008లో ఉపఎన్నిక జరిగిన ఈ స్థానం నుంచి ఇతని కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి విజయం పొందినాడు.
 
==మూలాలు==