పైలెట్ రోహిత్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==రాజకీయ జీవితం==
పంజుగుల రోహిత్‌రెడ్డి 2009లో ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలోకి అడుగు పెట్టాడు. ఆయనను ప్రజా రాజ్యం పార్టీ తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ​ఇంచార్జ్ గా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. 2013లో పీఆర్పీ కి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2014లో యంగ్ లీడర్స్ సంస్థను స్థాపించాడు. 2018లో పైలెట్ రోహిత్ రెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీ నుండి బహిష్కరించారు. అనంతరం అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి పోటీ చేసి మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు.ఆయన 2014 ఎన్నికల్లో తాండూరు నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించారు. 2014 ఎన్నికలు జరిగే నెల ముందు తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న పి.మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు రోహిత్ రెడ్డి పై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు. అనంతరం ఆయన తాండూరు నియోజకవర్గంలో యంగ్ లీడర్స్ సంస్థ ద్వారా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కణకు గురైన రోహిత్ రెడ్డి తరువాత 2018లో కాంగ్రెస్ లో చేరి, 2018 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పై దాదాపు పది వేల ఓట్ల మోజారిటీతో గెలిచాడు. పైలట్‌ రోహిత్‌రెడ్డి జూన్ 2019లో కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.
 
==మూలాలు==