లక్ష్మి విశ్వనాథన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 4:
ఈమె 10 దేశాలకు పైగా సందర్శించి అనేక ప్రదర్శనలు ఇచ్చింది. భారతదేశంలోని అన్ని ముఖ్యమైన నృత్యోత్సవాలలో పాలుపంచుకుంది. అనేక సెమినార్లలో పత్ర సమర్పణ గావించింది. ఈమె దేవాలయ నాట్యంపై, దేవదాసీ వ్యవస్థపై పరిశోధనలు చేసి వివిధ జర్నల్లలో, న్యూస్పేపర్లలో, డాన్స్ పోర్టల్లలో అనేక వ్యాసాలు ప్రకటించింది. "భరతనాట్యం ద తమిళ్ హెరిటేజ్", "కుంజమ్మ ఓడ్ టు ఎ నైటింగేల్" (ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితచరిత్ర), "వుమెన్ ఆఫ్ ప్రైడ్ ద దేవదాసి హెరిటేజ్", "కపిలేశ్వర టెంపుల్" వంటి పుస్తకాలను రచించింది. ప్రస్తుతం ఈమె కళాక్షేత్ర జర్నల్కు సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నది.
ఈమె బన్యన్ ట్రీ, చతురంగ, మై త్యాగరాజ మొదలైన నృత్యనాటకాలకు నృత్యదర్శకత్వం చేసింది. ఈమె "ది పొయెట్రీ ఆఫ్ డ్యాన్స్" అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ను తీసి ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించింది. ఈమె నాట్య గురువుగా అనేక మంది శిష్యులను నాట్యకళాకారులుగా తయారు చేసింది. ఈమె 1991 నుండి "మామల్లపురం నృత్యోత్సవాల"ను నిర్వహిస్తున్నది. ఈమె అనేక కమిటీలలో సభ్యురాలిగా సేవలను అందించింది. మద్రాసు సంగీత అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది.
నృత్య రంగంలో ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈమెకు అనేక పురస్కారాలు లభించాయి.
వాటిలో శ్రీకృష్ణ గాన సభ, మద్రాసు వారిచే "నృత్యచూడామణి" బిరుదు, మద్రాసు సంగీత అకాడమీ వారిచే "నృత్య కళానిధి" అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే [[సంగీత నాటక అకాడమీ అవార్డు]], మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే "కాళిదాస్ సమ్మాన్" అవార్డు, తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రం వారిచే [[కళైమామణి]] పురస్కారం మొదలైనవి ఉన్నాయి.
==మూలాలు==
|