వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
===ఉపోద్ఘాతము===
<ref>http://www.andhrabhoomi.net/content/ee-vaaram-special-3</ref>
జీవిత లో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం. పుట్టి, పెరిగి, బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. కుమారులు, కూతుళ్లను పెంచి పోషించి, విద్యా బుద్దులు చెప్పించి ప్రయోజకులను చేసి, ఆస్తి పాస్తులను సమకూర్చి, పెళ్లిల్లు చేసి ఓ బాట చూపించి.చివరి దశలో మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెబుతూ ఆడుతూ పాడుతూ గడిపే సమయం ఇది. ఆ వయసులోనూ వారి ఆలోచనలు వారసుల గురించే. వారికి ఏ కష్టం రాకూడదని, జీవితాంతం హాయిగా ఉండాలని పరితపిస్తుంటారు. ఆ దశలో తమె కొడుకులు ఏదేని వక్ర మార్గం అనుసరిస్తుంటే వారిని మంచి దారిలో పెట్టే ప్రయత్నంలో కొన్ని సలహాలు, సూచనలు చేస్తుంటారు. చాలా మందికి వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రుల సలహాలు నచ్చవు. వారిని ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక వస్తువులా భావిస్తుంటారు. ఇది వృద్ధులకు శాపం లాంటిది. పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటారు. కానీ మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి. వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఒక్కపూట అన్నం పెట్టలేక, ఆలనా పాలన చూడలేక కొందరిని రోడ్డు మీద వదిలేస్తుంటే, మరి కొందరు వృద్దాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 21ని ‘జాతీయ వృద్ధుల దినోత్సవం’గా ప్రకటించింది. 2007లో తల్లిదండ్రులు, పెద్దల పోషణకు సంక్షేమ చట్టం కూడ చేసింది.
<ref>https://te.vikaspedia.in/social-welfare</ref>
భారత దేశంలో వృద్ధుల జనాభా పెరుగుదల రోజు రోజుకీ ఎక్కువవుతోంది. 1951వ సంవత్సరంలో 1.98 కోట్లుగా ఉన్న వృద్ధుల సంఖ్య, 2001వ సంవత్సరం నాటికి 7.6 కోట్లకు చేరింది.
 
==వృద్ధుల కోసం సంక్షేమ పథకాలు / చట్టాలు ==.