రామమోహన గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
==భవన నిర్మాణం==
1912లో బందరు రోడ్డులో ఈ గ్రంథాలయం గల స్థలం వేలానికి వస్తే పురపాలక సంఘం వారినుండి దీనిని కొన్నారు. దానికి అవసరమైన ధనాన్ని చందాలు ప్రోగుచేశారు. కొంత ఖర్చును మునగాల రాజా [[నాయని వెంకట రంగారావు]] బహద్దరు, పాటిబండ సుబ్రహ్మణ్య, బొడ్డపాటి వెంకటప్పయ్య గార్లు అందించారు. 1913 నూతన గ్రంథాలయ భవనానికి అప్పటి మద్రాసు ప్రభుత్వ కార్యనిర్వాహక సభా సభ్యులుగానున్న సర్ వి. ఎస్. శివస్వామి అయ్యరు గారు శంఖుస్థాపన చేశారు. భవన ప్రవేశ మహోత్సవం [[పింగళి వెంకట రామారెడ్డి]] గారిచే జరుపబడింది. భవనానికి పై అంతస్థును కౌతా సూర్యనారాయణ గారు నిర్మించారు.
 
==కార్యక్రమాలు==
విజయవాడలో వెలసిన అనేక సంస్థలకు, సంఘాలకు, ఉద్యమాలకు ఈ గ్రంథాలయం కార్యస్థానంగా తోడ్పడింది.
* ఈ గ్రంథాలయం పక్షాన [[అయ్యదేవర కాళేశ్వరరావు]] గారు హరిజనులకు పాఠశాల నొకదానిని ఒక పాకలో నిర్వహించి వారిలో విద్యావికాసాలకు తోడ్పడ్డారు.
* ఈ గ్రంథాలయ ఆదరణ క్రింద 1914లో ప్రథమ ఆంధ్రదేశ గ్రంథ భాండాగారుల మహాసభ జరుపబడింది.
* 1917లో ఈ గ్రంథాలయం లో [[రాయసం వెంకటశివుడు]] గారు బాలల విభాగాన్ని స్థాపించారు.
* భారత స్వాతంత్రోద్యమ కాలంలో రహస్య పోరాటాలకు ఈ గ్రంథాలయం విప్లవకేంద్రంగా పనిచేసింది.
* నోరి వెంకటేశ్వర్లు గారు తమ "ఫూల్స్ క్లబ్" ను ఇందులోనే స్థాపించారు.
* గొప్ప ఉపన్యాసకులను, కళాకారులను, కవులను రప్పించి ఉత్సవాలు, వేడుకలు, సభలు గావించి వారిని ఈ గ్రంథాలయ ప్రాంగణంలో సన్మానించేవారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రామమోహన_గ్రంథాలయం" నుండి వెలికితీశారు