శాలిహోత్ర మహర్షి ప్రముఖ పశువైద్య శాస్త్రాకారుడుశాస్త్రకారుడు. పశువైద్యమును గురుంచి మొట్ట మొదట అధర్వవేదములోఅధర్వణవేదములో చెప్పబడినది.పశువులలో నులుపురుగుల నివారణకు అందు కొన్ని చికిత్సలు సూచించబడినవి.మానవుడు చికిత్సా విధానాన్ని పశుపక్ష్యాదుల నుండే గ్రహించెనని అధర్వవేదమునందు స్పష్టపరచుచున్నది.వేదకాలమునాటికి ప్రారంభదశలో ఉన్న పశు వైద్యము అనంతరకాలమున విస్తరించి బృహత్ శాస్త్రమైనది. ఈ శాస్త్రగ్రంధములన్నియు మహర్షుల చేత, పేరెన్నికగల వైద్యులచేత రచించబడినవి.ఈ శాస్త్రకారులలో '''శాలిహోత్రుడు''' పధమగణ్యుడై భారతీయ పశు వైద్యశాస్త్ర పితామహుడు అయినాడు.