రాయడప్ప రంగారావు: కూర్పుల మధ్య తేడాలు
బొబ్బిలి సంస్థానాధీశులు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) ←Created page with ''''రాజా రాయడప్ప రంగారావు''' (179-1830) బొబ్బిలి సంస్థానాధీశులు, కవులు...' |
(తేడా లేదు)
|
18:31, 11 మే 2021 నాటి కూర్పు
రాజా రాయడప్ప రంగారావు (179-1830) బొబ్బిలి సంస్థానాధీశులు, కవులు, సాహిత్య పోషకులు.
బొబ్బిలి చిన రంగారావుకు సంతానం లేకపోవడం వలన పాల్తేరు వాస్తవ్యుడు సుబ్బమాంబ మరియు అన్నారావుల పుత్రుడైన రాయడప్ప రంగారావును దత్తత తీసుకున్నారు. వీరు కందాళ వేంకటార్యుని శిష్యుడు.
వీరు "సంకల్ప సూర్యోదయం" అనే వేదాంత నాటకాన్ని రచించారు. దీనికి మూలం సంస్కృతం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బోధించే రచన. దీనిని వేదాంతదేశికులు రచించారు. పంచవిధ శారీరక శాస్త్రార్థం ఇందులో వర్ణించారు. తెలుగు ప్రబంధరూపంలోకి రాజావారు గద్యపద్య మిళితంగా తెలుగుచేశారు.
మూలాలు
- బొబ్బిలి సంస్థాన చరిత్ర - సాహిత్య పోషణ (2002), బోనాల సరళ, పేజీ. 120-127.