కుతుబ్ షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ ...
ఇతర మార్పులు...
పంక్తి 57:
== పరిపాలన ==
 
ఈ వంశము [[తెలుగులు|తెలుగు వారిని]] పరిపాలించిన తొలి ముస్లిం వంశము. ఇది అంధ్ర దేశమును ముస్లింలు పరిపాలి‌చిన (తెలంగాణ ప్రాంతము), హిందూ పరిపాలనలో ఉన్న ఇతర ప్రాంతములుగా విభజించింది. ఈ వంశము [[1687]]లో [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] చక్రవర్తి [[ఔరంగజేబు]] యొక్క సైన్యాలు [[దక్కన్]]ని జయించేవరకు, 171 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించింది. ఆ తరువాత [[1948]]లో [[హైదరాబాదు రాజ్యము]], [[న్యూఢిల్లీ]] యొక్క సైనిక జోక్యం (పోలీసు చర్య) తో [[భారత దేశము]]లో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది.
 
కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా, శాస్త్ర పోషకులు. వీరు [[పర్షియన్ సంస్కృతి]]ని పోషించడమే కాకుండా, ప్రాంతీయ [[దక్కన్]] సంస్కృతికి చిహ్నమైన [[తెలుగు భాష]], కొత్తగా అభివృద్ధి చెందిన [[ఉర్దూ భాష|ఉర్దూ]] ([[దక్కనీ]]) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత [[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాదు]] రాజ్యమునకు రాజధానులుగా ఉండేవి, ఉభయ నగరములును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు.
 
== వంశ క్రమము ==
"https://te.wikipedia.org/wiki/కుతుబ్_షాహీ_వంశం" నుండి వెలికితీశారు