పల్లవులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: '''పల్లవులు''' పల్లవులు ఎచటివారు అనే ప్రశ్న చరిత్రకారులకు వివాద... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''పల్లవులు'''
పల్లవులు ఎచటివారు అనే ప్రశ్న చరిత్రకారులకు వివాదాస్పదమైన విషయము. [[సాతవాహన]] రాజు గౌతమీపుత్ర సాతకర్ణి 'శకపహ్లవుల'ను నిర్జించెనని నాసిక్ శాసనము తెలుపుతున్నది. దీని ఆధారముగా పల్లవులు పారశీక దేశవాసులనియు, శక-పహ్లవ-కాంభోజ జాతుల వలసలలో భాగముగా దక్షిణదేశము చేరి సాతవాహనులతో సంబంధములు నెరిపి క్రమముగా స్వతంత్రులయ్యారని చెప్పవచ్చును. శాసనములలో వీరు బ్రాహ్మణులమని, భారధ్వాజ గోత్రీకులమని, బ్రహ్మక్షత్రియులమనీ చెప్పుకున్నారు. ప్రాచీన [[తమిళ]] గ్రంథాలు పల్లవులను విజాతీయులుగా పరిగణించాయి.
క్రీ. శ. రెండవ శతాబ్దిలో కాలభర్తి అనువాడు ఉత్తరదేశమునుండి వచ్చి సాతవాహనులకడ ఉద్యోగిగా చేరాడు. ఇతడు చూటు వంశీయుల కన్యను పెండ్లాడగా ఆమెవలన చూతుపల్లవుడు జన్మించాడు. చూతపల్లవుని కుమారుడు వీరకూర్బవర్మ. ఈతని మనుమడు స్కందమూలునికి పూర్వీకులవల్ల దక్షిణాంధ్ర దేశము, దానికి సమీపములోని [[కర్ణాట]] ప్రాంతములు సంక్రమించాయి. సాతవాహనుల సామ్రాజ్యము అంతరించిన తరువాత, స్కందమూలుడు
|