వెలమ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 5:
==చరిత్ర==
ప్రముఖ సాంఘికవేత్త, చరిత్రకారుడు ఎడ్గార్ థర్ స్టన్ ప్రకారము వెలమ,[[కమ్మ]] కులములు ఒకే మూలమునుండి విడిపోయినవి. ఈ ఘటనపై తెలుగు సాంప్రదాయములో బహు కథనాలు ప్రచారములోఉన్నాయి కాని దేనికీ చారిత్రకాధారములు లేవు. ఈ రెంటి కులములలోని ఆచారవ్యవహారములు, గోత్రములు,
===కాకతీయుల పూర్వ కాలము===
కాకతీయులకు పూర్వకాలములో రేచెర్ల వంశమునకు చెందిన వారు పలనాటి సీమలో కాలచూరి వంశమునకు చెందిన హైహయ రాజుల వద్ద సైనికులుగా, సేనాధిపతులుగా, మంత్రులుగా ఉన్నారు. మాచెర్లను పాలించిన అలుగు రాజు వద్ద దొడ్డ నాయుడు ఆతని కుమారుడు బ్రహ్మ నాయుడు మంత్రులుగా ఉన్నారు. దాయాదుల మధ్య జరిగిన పోరులో బ్రహ్మ నాయుడు మలిదేవరాజు పక్షమున పోరాడి ఓడిపోతాడు. బ్రహ్మనాయుని సాంఘిక సంస్కరణలు తెలుగువారికి సువిదితములే. ఎట్టి చారిత్రకాధారాలు లేకపోయిననూ పలనాటి యుద్ధము తెలుగు సాహిత్య, సంప్రదాయములలో స్థిరముగా నిలిచిపోయిన వాస్తవ సంఘటన. పలనాటియుద్ధము కారణముగా పెక్కు రాజవంశాలు (తెలుగు చోడులు, హైహయులు, హోయసాలులు, కోట వంశస్థులు) బలహీనపడినవి. కాకతీయ సామ్రాజ్య విస్తరణకు ఈ పరిస్థితులు అనుకూలమయ్యాయి.
===కాకతీయ కాలము===
====పద్మనాయకులు====
|