ముహమ్మద్ బిన్ తుగ్లక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
==రాజ్య సంక్రమణ==
బెంగాల్ దండయాత్రనుండి తిరిగివస్తున్న గియాసుద్ధీన్ తుగ్లక్ ను ఆహ్వానించటానికి ఢిల్లీ శివార్లలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక పెద్ద ఎత్తైన వేదిక ఏర్పాటు చేశాడు. అయితే ఊరేగింపు జరిగేటప్పుడు ఏనుగు తగిలితే మొత్తం కూలేటట్లు దాని రూపకల్పన జరిగింది. వేదిక పథకం ప్రకారం గియాసుద్ధీన్ పై కూలి ఆయన మరణించడంతో మహమ్మద్ బిన్ తుగ్లక్‌కు రాజ్యం సంక్రమించింది. మరో కథనం ప్రకారం తనయుడు ఒక చెక్క బాల్కనీ కట్టించి అది తండ్రిపై కూలేట్టు చేశాడని చెబుతారు. మొత్తానికి తండ్రి హత్యకు పథకాన్ని రచించి నిర్వహించింది మహమ్మద్ బిన్ తుగ్లకే అన్నది సాధారణంగా అందరూ ఒప్పుకునే విషయం.<ref>http://india.mapsofindia.com/culture/monuments/tughlaqabad.html</ref> ఈ ప్రమాదంలో తండ్రికి ప్రియ తనయుడు మరియు వారసత్వంలో జునా ఖాన్ కంటే ముందుగా ఉన్న మహుమూద్ ఖాన్ కూడా మరణించాడు. ఆ తరువాత శిధిలాలని తొలగిస్తున్నప్పుడు గియాసుద్దీన్ శరీరము మహుమూద్ ఖాన్ పైన చేయూతనిచ్చి రక్షించే ప్రయత్నం చేసినట్టు కనిపించినట్టు తారీఖ్-ఎ-ఫిరూజ్‌షాహీలో బర్నీసమకాలిక చరిత్రకారుడు జియావుద్దీన్ బరానీ ఉల్లేఖించాడు<ref>Studies in Medieval Indian Architecture By R. Nath పేజీ.22 [http://books.google.com/books?id=KSiNuxJ3JeYC&pg=RA1-PA19-IA1&lpg=RA1-PA19-IA1&dq=muhammed+bin+tughlak&source=web&ots=bgm9qHTyVl&sig=DTEZP39Rpv1fZ18uGOCRkca41K8&hl=en&sa=X&oi=book_result&resnum=10&ct=result#PRA1-PA19-IA1,M1]</ref>.
 
==పరిపాలన==