దాసరి రామతిలకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''దాసరి రామతిలకం''' (1905-1952) సంగీత, నృత్య కళాకారిణి, రంగస్థల నటి, తొలి తరపు [[తెలుగు సినిమా]] నటి. తొలినాటి సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి [[గిరిజ (నటి)|గిరిజ]] ఈమె కుమార్తె. రామతిలకం [[చింతామణి]] చిత్రంలో చింతామణి పాత్రను పోషించారు. తెలుగు తెరపై వేశ్య పాత్ర పోషించిన తొలి కథానాయిక ఈమే.<ref>[http://m.newshunt.com/Andhrajyothy/Cinema/19427790/997 వెండితెర మధురవాణి - ఆంధ్రజ్యోతి]</ref>
==జీవిత విశేషాలు==
ఆమె నివాసస్థలం [[విజయవాడ|బెజవాడ]]. ఆమె తండ్రి [[ఆంధ్ర దేశం]]లో మృదంగ వాద్యమునందు ప్రసిద్ధిగాంచినవారిలో నొకరగు [[పువ్వుల పెంకటరత్నం]] గారు. స్వజాతీయుడగు పువ్వుల నారాయణగా వద్ద ఈమె సంగీతం నేర్చుకున్నది. సంగీతంలో కచ్చేరిచేయుటకు తగినంత జ్ఞానం సంపాదించింది. కొన్నిచోట్ల కచ్చేరీలు కూడా చేసి బహుమతులు పొంది ప్రశంసింపబడ్డది.
 
[[మైలవరం (కృష్ణా జిల్లా)|మైలవరం]] కంపెనీ మేనేజరుగారైన కీ శే కొమ్మూరు పట్టాభిరామయ్యగారు స్థాపించిన లక్ష్మీవిలాస సభ లోను, అనంతరం కపిలవాయి రామనాథశాస్త్రిగారి బాలభారతి నాట్యమండలియందును, చింతామణి, చిత్రాంగి, సత్యభామ, అహల్య, సొనిత్రి మొదలైన వేషాలు వేసింది. 1982 [[నవంబరు]]లో [[కలకత్తా]] [[ఈస్టు ఇండియా]] కంపెనీవారిచే తయారుచేయబడిన [[తెలుగు]] సావిత్రి ట్రాకీ ఫిల్మునందు సావిత్రిపాత్ర ధరించి అఖండకీర్తి ప్రతిష్టలాంచినది. 1933 వూర్చిలో [[కలకత్తా]] మదన్ ఫిలింకింపెనీవారి [[తెలుగు]] చితామణి టాకీయందు చింతామణిపాత్ర ధరించినది.
"https://te.wikipedia.org/wiki/దాసరి_రామతిలకం" నుండి వెలికితీశారు