మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: భారతిభారతి
పంక్తి 10:
| occupation = చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రవేత్త
}}
'''[[మల్లంపల్లి సోమశేఖర శర్మ]]''' సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రజ్ఞుడు. [[విజ్ఞాన సర్వస్వం]] ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]]లో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రరయ్య గార్లకు [[1891]] లో జన్మించాడు. ఈయన గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని "పాలకూరు"కి "బమ్మెర"కు సమీపమున నున్న గ్రామం కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చారని తెలుస్తుంది. సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి. సాహిత్యరంగంలోను, రాజకీయ రంగంలోను ప్రసిద్ధి గాంచాడు. [[బిపిన్ చంద్రపాల్]] ప్రసంగాల ప్రభావం ఈయన మీద ఉండటం వల్ల [[రాజమహేంద్రవరం]]లో విద్యార్థులు వందేమాతర ఉద్యమం చేపట్టాడు.<ref name="BSL">డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి</ref>
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 17:
అప్పటికి ఆంధ్ర దేశంలో చరిత్ర పరిశోధన ప్రాథమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నాడు. ఒంటరిగాను, మిత్రుడు [[నేలటూరి వెంకట రమణయ్య]]తో కలిసీ [[నెల్లూరు]] జిల్లాలోను, [[రాయలసీమ]] ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు సాగించాడు. ఇతనిని ''శాసనాల శర్మ'' అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ అన్వేషణ ఫలితంగా [[అశోకుడు|అశోకుని]] ఎర్ర గుడిపాడు శాసనం, పల్లవ, తెలుగు చోడ, రెడ్డి, విజయనగర రాజుల కాలంనాటి ఇతర శాసనాలు వెలుగులోకి వచ్చాయి.
 
తాము సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ ''ఎపిగ్రాఫియా ఇండియా'', [[భారతి (మాస పత్రిక)|భారతి]], [[శారద]], [[ఆంధ్ర పత్రిక]] వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. [[ఘంటసాల]] ప్రాకృత శాసనాల గురించి శర్మ వ్రాసిన వ్యాసం అతని మరణానంతరం ప్రచురితమయ్యింది. శాసనాల లిపిని పరిశోధించడంలోనూ అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు శర్మ మాత్రమే అనవచ్చును. ఏ సమస్యనైనా భిన్న దృక్కోణాల నుండి పరిశిలించి సమన్వయ శాస్త్రీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు వెల్లడించేవాడు<ref name="BSL"/>. అహదహనకర శాసనంలోని ఒక అక్షరాన్ని శర్మ "ఱ"గా గుర్తించగా [[వేటూరి ప్రభాకర శాస్త్రి]] దానిని "ష+జ" ('ష' క్రింద 'జ' వత్తు) అని అన్నాడు. ఈ విషయమై వారిద్దరికీ ఆసక్తికరమైన వాదోపవాదాలు నడచాయి. అయితే ఎంతటి పాండిత్యమూ, పట్టుదలా ఉన్నా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి సరిదిద్దుకోవడానికీ, ఎదుటివారి సూచనలను గౌరవించడానికీ ఆయన సిద్ధంగా ఉండేవాడు.
 
== శాసన పరిశోధనలు ==