తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
మరింత సమాచారం |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో [[ఖమ్మం లోక్సభ నియోజవర్గం]] నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1978లో [[జనతాపార్టీ]] తరఫున [[హైదరాబాదు]] నగరంలోని [[హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం]] నుండి గెలుపొందింది.<ref>తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286</ref>
పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా ఉన్న లక్ష్మీకాంతమ్మ ఇందిరాగాంధీకి సన్నిహితురాలు. ఎమర్జెన్సీ కాలములో ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా విమర్శించి జనతాపార్టీలో చేరింది. జనతా పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నది.<ref>[http://in.telugu.yahoo.com/News/Regional/0712/13/1071213058_1.htm మాజీ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ కన్నుమూత - యాహూ తెలుగు వార్త]</ref>
లక్ష్మీకాంతమ్మ 83 యేళ్ల వయసులో [[విజయవాడ]]లోని తన కూతురు ఇంట్లో [[డిసెంబర్ 13]], [[2007]]న మరణించింది.<ref>[http://www.thehindu.com/2007/12/14/stories/2007121454210400.htm హిందూ పత్రికలో లక్ష్మీకాంతమ్మ మరణవార్త]</ref>
|