కోటి వేంకనార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 5:
 
==ప్రచురణలు==
ఇది తొలుత 1916లో మహామహోపాధ్యాయ శ్రీమాన్ పరవస్తు వేంకటరంగాచార్యులయ్యవారలం గారిచే ఆర్ధఆర్ష ముద్రశాలలో అచ్చయినది.వారి క్యాటిలాగ్ లో ఇది కోటి వేంకన కవి ప్రణీతము అని వ్రాసినారు. ఇది తెలుగు నిఘంటవులన్నింటొలోను గొప్పది. తెలుగునకు [[అమరకోశము]] వంటిది.అమరకోశము నందువలె కాండములు వర్గములు అన్నియుకలవు.దీనిలో క్రియావర్గము ఒకటి అధికము. అటుపై శ్రీవావిళ్ళ ప్రెస్ వారు 1931లో దీనిని ప్రచురించినారు. కానీ 1966 సంవత్సరమున ఏలూరు పట్టణమునందు వెంకట్రామన్ ఎండ్ కో అధ్యక్షులైన ఈసర వెంకట్రావు పంతులు గారిచే ముద్రించిన శిరోమణి శ్రీమాన్ చలమచర్ల రంగాచార్యుల (రీడర్, తెలుగుశాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయము) వారిచే విరచితమైన ఆంధ్రశబ్దరత్నాకరము అనెడి అకారాది వర్ణక్రమబద్దమైన పెద్ద నిఘంటువులో అవతారిక 31వ పుటలో నుదురుపాటి వేంకటకవి దీనిని రచించినాడని తెలిపినారు. 18వ శతాబ్దంలో పుదుక్కోట సంస్థానమునందుండిన విద్వత్కవి ఈతడు అని తెలిపినారు. కానీ అటుపై వచ్చిన పెక్కు నిఘంటువుల ప్రచురణలలో కోటి వేంకనార్యుడే దీనిని రచించినాడని తెలుపినారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోటి_వేంకనార్యుడు" నుండి వెలికితీశారు