యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
== బాల్యం,విద్య ==
వెకటప్పయ్య గారు కృష్ణ జిల్లా [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]] గ్రామంలో '''యలమంచిలి అంకప్ప, ఆదెమ్మ''' దంపతులకు 30 డిశెంబరు 1898లో జన్మించారు. వీరిది నిరుపేద [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబం]]. వీరికి ఐదుగురు [[అన్నదమ్ములు]], ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు<ref>{{Cite book|title=బీద బ్రతుకు|last=యలమంచిలి|first=వెంకటప్పయ్య స్వీయ చరిత్ర|publisher=యలమంచిలి వెంకటప్పయ్య సంస్మరణ వేదిక. ప్రచురుణ సంఖ్య-3|year=2010|location=విజయవాడ|pages=1 - 75}}</ref>.
[[దస్త్రం:Venkatappayya Beeda bratuku .jpg|thumb|బాల్యంలో వెంకటప్పయ్య - స్వీయ రచన బీదబ్రతుకులో ఊహా చిత్రం]]
 
వెంకటప్పయ్య గారు 14 ఏండ్ల లోపలే ఆంధ్ర నామ సంగ్రహము, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము వంటి గ్రంధాలతో పాటు అమర కోశము కంఠస్థం చేసారు. 1914 లో [[కురుమద్దాలి|కురుమద్దాళి]] లో వారాలు చేసుకొని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] నేరుచుకున్నారు, దాతల సహాయంతో 1916లో విజయవాడలో కమ్మ విద్యార్థి వసతి గృహం లో ఉండి యస్. కె,పి.పి హైస్కూల్ లో 8వ తరగతిలో చేరాడు. 1919లో యస్.యస్.యల్.సి పరీక్షలో తప్పి మరల దానినే చదుతున్న సమయంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] విజయవాడ వచ్చారు. వారి ప్రసంగం విన్న వెంకటప్పయ్య గారు చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర పోరాటంలో పాల్గోన్నారు. ఆతరువాత హిందీ భాషపై అనురక్తి కలిగి నెల్లూరు వెళ్ళి మోటూరి సత్యనారాయణ గారి వద్ద హిందీ ప్రచార శిక్షణ పొంది హిందీ భాషా బోదకుడిగా మారాడు.