1966లో [[ఢిల్లీ]] మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జన సంఘ్ తరపున ఎన్నికై మరుసటి సంవత్సరమే [[ఢిల్లీ]] మున్సిపల్ [[కార్పోరేషన్]] అధ్యక్షుడయ్యాడు. 1970లో [[రాజ్యసభ]]కు ఎన్నికైన అద్వానీ జనసంఘ్ లో ప్రముఖ పాత్ర వహించి దేశ ప్రజలను ఆకర్షించాడు. 1975లో [[మీసా చట్టం]] కింద అరెస్ట్ అయ్యాడు. [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] కాలంలో తన అనుభవాలను వివరిస్తూ అద్వానీ [[ది ప్రిజనర్స్ స్క్రాప్ బుక్]] గ్రంథాన్ని రచించారు. 1976లో జైలు నుంచే రాజ్యసభకు ఎన్నికైనాడు. ఎమర్జెన్సీ అనంతరం జనసంఘ్ పార్టీ [[జనతా పార్టీ]]లో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి [[మొరార్జీ దేశాయ్]] ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా [[మంత్రి]]గా పనిచేశారు. ఆ విధంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరుపడి [[భారతీయ జనతా పార్టీ]] పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించే అవకాశం కల్గింది.