షర్మిలారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 15:
అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్12, 2012నుంచి జరుగుతున్న ఉపఎన్నికలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా ప్రజాజీవితంలోకి అధికారికంగా వచ్చింది.జూన్ నెలలో జగనును అరెస్టుచెయ్యగా, ఉప ఎన్నిక ప్రచారానికై జగనుపార్టీ అభ్యర్థి[[కొండ సురేఖ]]తరుపున ఆమె ప్రచారములో పాల్గొనటంద్వారా ఆమె ప్రత్యక్షరాజకీయ జీవితం మొదలైనది. అంతకుముందు ఆమె, అనేక క్రిస్టియను మతప్రచారసభలలో పాల్గొని ప్రసంగించిన అనుభవమున్నది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పాదయాత్ర.
 
pu==మరోప్రజాప్రస్థానం==
వైయస్సారు కాంగ్రెసు అధ్యక్షుడు అయిన జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమఆస్తులను కలిగివున్నాడనే ఆరోపణమేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపఎన్నికలముందే అరెస్టు చేసారు.ఈ నేపథ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా, పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి బలోపేతంచేయు దిశగా '''మరో ప్రజా ప్రస్థాపన ''' పేరు మీద పాదయాత్రను18 అక్టొబరు2012న ప్రారంభించారు. ఈపాదయాత్ర 16 జిల్లాలమీదుగా సాగుతుంది, యాత్ర దూరము 3000 కి.మీ. తనపాదయాత్రను, తనతండ్రి దివంగత [[రాజశేఖరురెడ్డి]] సమాధి (ఇడుపుల పాయ) నుండి ప్రారంభించింది. పాదయాత్రలో షర్మిలకు డిసెంబరు17 న గాయం అగుటవలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది.అమె కాలికి [[అపోలో]] ఆపరెసను చేసి, ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకొనవలసినదిగా సలహానిచ్చారు.ఆమె స్వస్తత పొందినతరువాత ఫిబ్రవరి 6,2013 నుండి మళ్ళి పాదయాత్ర ఆరంభించింది.ఈ పాదయాత్ర ఇచ్చాపురంవరకు కొనసాగి ఆగస్టు 4, ఆదివారం న ముగిసినది.9 నెలలకు పైగా కొనసాగిన ఈ పాదయాత్ర 14 జిల్లాలగుండా జరిగింది.116 నియాజకవర్గాల మీదుగా జరిగింది. ఇందులో 9 కార్ఫోరేసన్లు, 45 మున్సిపాలిటిలు, 195 మండలాలు ఉన్నాయి.ఈ యాత్ర 2250 గ్రామాలను తాకుతూ సాగింది.మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండను నిర్వహించడం జరిగింది. 152 ప్రదేశాలలల్ఫో బారీ స్థాయిగా జరిగిన జనసభలలో ప్రసంగించడం జరిగింది. ఈ పాదయాత్రలో దాదాపు కోటిమందికి పైగా జనాలను షర్మిలా ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా వేసారు.
 
"https://te.wikipedia.org/wiki/షర్మిలారెడ్డి" నుండి వెలికితీశారు