డి. కె. అరుణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
[[మహబూబ్ నగర్ జిల్లా]] నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన '''[[డి.కె.అరుణ]]''' [[గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ రాజకీయాలలో పేరుపొందినవే. తండ్రి, సోదరుడు ఇదివరకు [[మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి గెలుపొందగా, మామ, [[భర్త]] గద్వాల నుంచి ఎన్నికైనారు. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి, [[గద్వాల్ శాసనసభ నియోజకవర్గం|గద్వాల]] అసెంబ్లీకి రెండు సార్లు ఓడిపోయిననూ [[2004]]లో తొలిసారి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టగా మళ్ళీ [[2009]]లో రెండో సారి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009</ref> నియమించబడింది.
==బాల్యం, కుటుంబం==
డి.కె.అరుణ [[1960]], [[మే 4]]న [[నారాయణపేట జిల్లా]] [[ధన్వాడ (ధన్వాడ మండలం)|ధన్వాడలో]]లో జన్మించింది. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యుడిగా ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు [[నారాయణపేట]]లో [[నక్సలైటు|నక్సలైట్ల]] కాల్పులకు గురై మరణించాడు. సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది శాసనసభలో ప్రవేశించాడు. భర్త [[డి. కె. భరతసింహారెడ్డి]], మామ డి. కె. సత్యారెడ్డిలు కూడా పేరుపొందిన రాజకీయనేతలు. వీరిరువురూ గతంలో గద్వాల నుంచే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/డి._కె._అరుణ" నుండి వెలికితీశారు