పసుపు ఆకుమచ్చ తెగులు: కూర్పుల మధ్య తేడాలు
MYADAM KARTHIK (చర్చ | రచనలు) ←Created page with 'ఆకుమచ్చ తెగులు పసుపు పంట చివరి దశలో అంటే నవంబర్ , డిసెంబర్ మాసాలలో ఎక్కువగా కనబడుతుంది. ==కారణాలు== 1.గాలిలో ఎక్కువ తేమ , తక్కువ ఉష్ణోగ్రత ఉండటం. 2.పంటలో సూక్ష్మ వాతావరణం ఎక్కువ...' |
(తేడా లేదు)
|
05:01, 20 జూలై 2021 నాటి కూర్పు
ఆకుమచ్చ తెగులు పసుపు పంట చివరి దశలో అంటే నవంబర్ , డిసెంబర్ మాసాలలో ఎక్కువగా కనబడుతుంది.
కారణాలు
1.గాలిలో ఎక్కువ తేమ , తక్కువ ఉష్ణోగ్రత ఉండటం. 2.పంటలో సూక్ష్మ వాతావరణం ఎక్కువ తేమగా ఉండటం. 3.పంట అవశేషాలు పొలంలో,పొలం చుట్టూ ఉండటం.
లక్షణాలు
మొదట ఆకుల పై చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి.క్రమేపి ఇవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకు మాడిపోతుంది. దుంపలు,కొమ్మలు ఎదుగుదల తగ్గి దిగుబడి,నాణ్యత తగ్గిపోతాయి.
యాజమాన్య పద్ధతులు
1.విత్తనశుద్ధి చేయాలి.
2.తెగులుతో మచ్చలు ఉన్న,ఎండిన ఆకులను తొలగించి రాల్చి వేయాలి.
సేంద్రియ నివారణ
1.ఆవు మూత్రాన్ని మట్టి కుండలో తీసుకుని ఒకవారము పులియా నివ్వాలి.దీనిని పంటపై పిచికారి చేసి శిలీంధ్ర తెగుళ్ళను నివారించవచ్చు .
2.ఒక లీటరు ఆవు మూత్రాన్ని ఒక లీటరు మజ్జిగ,8లీటర్ల నీటితో కలిపిన మిశ్రమాన్ని పంట పైన పిచికారీ చేసి శిలీంద్ర తెగులని నివారించవచ్చు.