'''స్థల పురాణముపురాణం''': పెరుమాళ్ కావేరీ నది కికావేరీనదికి గంగా నది హోదా ఇచ్చేను. శ్రీ రంగములో కావేరిని శయ్య గా వినియోగించేను. తిరుచేరాయి లో మాతృమూర్తి గా, ఈ క్షేత్రములో పెరుమాళ్ శిరస్సు వద్ద హోదా (శివుడు శిరస్సు పై గంగ ఉన్నట్లు) కల్పించేను. కావేరీ దేవి పెరుమాళ్ తిరుముగము వద్ద, గంగ పెరుమాళ్ తిరువాడి వద్ద గర్భ గుడి లో దర్శనము. గంగ కావేరీ తో చంద్రుడు శిరస్సు వద్ద, సూర్య భగవాన్, యముడు, అంబారీష్ తిరువాడి వద్ద కొలువై ఉన్నారు. చంద్రునకు శాపవిమోచనము కలిగించి ప్రత్యక్షమయిన ప్రదేశము. ఈ క్షేత్రము ఏకాదశి వ్రత ఉపవాసము నకు ప్రసిద్ధి. భక్తులు ఏకాదశి నాడు ఉదకము కూడా సేనించకుండ మరునాడు వరకు పెరుమాళ్ ని ద్యానిస్తూ ద్వాదశి నాడు పూర్ణోదయము తరువాత ఉపవాసమును విడువ వలేను. అట్లు చేసిన మోక్షము కలుగునని నమ్మకము. అంబారుషుడు సహస్ర ఏకాదశి ఉపవాసములు చేసేను. ఈ వ్రతము సంపూర్ణము అయినచో అంబారిషునకు దేవలోకము లో దేవత లతో సమానము గా హోదా కలుగునని దేవతలు ఇష్టపడక వ్రతభంగము చేయుటకు దూర్వాస ముని ని అంబారుషిణి వద్దకు పంపెను. ద్వాదశి నాడు ఉపవాసము వీడుటకు ఫలములు భుజించుటకు ఆయుత్త మయిన సమయములో దూర్వాస ముని వేంచేసెను. అంబారుషుడు దూర్వాస ముని ఏకాదశ వ్రతము భంగపరుచుటకు వచ్చెనని తెలియక విందుకు అతిధిగా ఆహ్వానించేను. దూర్వాస ముని నదిలో స్నాన మాచరించి ఆతిధ్యము స్వీకరిస్తాను అంతవరకు వీక్షించమని వెడలెను. దూర్వాస ముని సమయము మించిపోయినా రాకపోవుట వలన అంభారుషుడు సత్పురుషులను సంప్రదించి వ్రత భంగము కలగకుండా నీటి బిందువులను వ్రత దీక్ష సమాప్తము చేయుటకు సేవించెను. దూర్వాస ముని దివ్య దృష్టి తో ఈ విషయము చూచి పిశాచమును సృష్టించి అంభారుషుడిని వధించమని ఆదేశించెను. పిశాచము అంభారుషుని తరుముతున్న ఈయన పెరుమాళ్ ని శరణు జొచ్చెను. పెరుమాళ్ తీక్షణముగా పిశాచమును వీక్షించగా, పిశాచము పారిపోయినది. దూర్వాస ముని అంబారుషుని భక్తిని తెలుసుకొని పెరుమాళ్ ని శరణు వేడెను. పెరుమాళ్ అంబరుషుడు సహస్ర ఏకాదశ వ్రతములు పూర్తి చేసినందున వరము నొసగ, అంబరుషుడు పెరుమాళ్ సన్నిధిలో కొలువై భక్తులను దీవించుటకు అవకాశము కోరెను. పెరుమాళ్ ఆయన కోరికను మన్నించి సన్నిధిలో తిరువాడి వద్ద స్థానము కల్పించేను.
శ్రీరంగము ను ఆధి ఆరంగం, తిరుకుడన్థై ని మధ్య ఆరంగం గాను ఈ క్షేత్రము ను ఆంధియ ఆరంగం గాను పేరు.