పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు, వనరులు: AWB తో సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
పొట్టి శ్రీరాములు [[1901]] [[మార్చి 16]]న [[మద్రాసు]], జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] లోని [[పడమటిపాలెం]] గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం [[మద్రాసు]] లోనే జరిగింది. తరువాత [[ముంబై|బొంబాయి]]లో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ [[ఉద్యోగం]] చేసాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు.
 
1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని [[భార్య]] కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, [[గాంధీజీ]] అనుయాయిగా [[సబర్మతీ ఆశ్రమం|సబర్మతి ఆశ్రమం]] చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
 
==స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర==
పంక్తి 78:
మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు [[మద్రాసు]]లో [[1952]] [[అక్టోబర్ 19]]న [[బులుసు సాంబమూర్తి]] ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు.<ref>{{cite wikisource|last1=తుర్లపాటి|first1=కుటుంబరావు|title=నా కలం - నా గళం|chapter=ఆత్మకథ విషయపేజీలు|year=2012|publisher=సుందర శేషమాంబ పబ్లికేషన్స్}}</ref> చివరికి [[1952]] [[డిసెంబర్ 15]] అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. [[మద్రాసు]]లో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో [[మద్రాసు]] నుండి [[విశాఖపట్నం]] వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి [[డిసెంబర్ 19]]న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్ నెహ్రూ]] ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని [[చక్రవర్తుల రాజగోపాలాచారి]] తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన [[వరంగల్లు]] రాజధానిగా బాగుంటుందని [[అంబేద్కర్]] సూచించారు. [[రాజమండ్రి]] కూడా మంచిదేనన్నారు. [[విజయవాడ]] కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. [[నెల్లూరు]], చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, రాజధాని [[రాయలసీమ]]లోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని [[నీలం సంజీవరెడ్డి]] తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా [[1953]] [[అక్టోబర్ 1]]న [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పరచారు. [[బళ్ళారి]], [[బరంపురం]], [[హోస్పేట]], [[తిరువళ్ళూరు]] లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.
 
==మరణం gurinchi==
రోజురోజుకూ [[ఆరోగ్యం]] క్షీణస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. [[వార్తా పత్రిక]]ల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. [[ఎక్కిళ్ళు]], తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం... పైగా [[వాంతులు]], తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. [[డిసెంబరు 5]]వ తేదీనాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయరసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో [[నెత్తురు]] పడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబరు నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ [[చొక్కా]] వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో [[గ్లూకోజ్]] ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం; ప్రభుత్వం స్పందించకపోవడం; ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓరోజు [[బులుసు సాంబమూర్తి]], నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు.
 
పంక్తి 91:
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}4. https://www.bbc.com/telugu/india-43402522
 
== వెలుపలి లంకెలు ==
* [[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]] రచించిన ''సుప్రసిద్ధుల జీవిత విశేషాలు''
 
* . https://www.bbc.com/telugu/india-43402522
<!-- వర్గాలు -->
 
* [[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]] రచించిన ''సుప్రసిద్ధుల జీవిత విశేషాలు''
{{Authority control}}
 
Line 104 ⟶ 105:
[[వర్గం:నిరాహారదీక్ష మరణాలు]]
 
<!-- Interwiki links -->
[[వర్గం:నెల్లూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నవారు]]
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు