ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5:
మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా క్రీ.శ. 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె [[తిక్కన సోమయాజి]]కీ, భాస్కరునికీ, [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రు]]నికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు.వంగడమునుబట్టి '''కుమ్మరి మొల్ల''' అని విశ్వమున వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు '''కేతనపెట్టి'''. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు [[శ్రీనాధుడు]]ని స్మరించియుండుటచే ఈమె [[శ్రీనాధుడు]] తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది.చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు.
స్వస్థలం: [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]], [[గోపవరం మండలం]], [[గోపవరం]] గ్రామం .ఈ గ్రామం కడప పట్టణానికికు 56 కి.మీ దూరంలో ఉంది. బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి చెందినదని మొల్ల రామాయణంలోని ఈ క్రింది పద్యం ద్వారా తెలుస్తుంది.
{{వ్యాఖ్య|గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రామం లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప
|