మహాకవి క్షేత్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
మహాకవి క్షేత్రయ్య 1976లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. [[క్షేత్రయ్య]] పేరు తో పిలవబడే వరదయ్య కృష్ణా తీరం లోని మువ్వ గ్రామ నివాసి. అతడు మువ్వగోపాల పదాలు అనేకం రచించాడు. భక్త తుకారాం నిర్మించిన [[అంజలీ పిక్చర్స్]] వారు అదేకోవలో క్షేత్రయ్యకథను నిర్మించారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు శ్రోతల్ని అలరించాయి.(రేపల్లె లోని గోపాలుడంట, జాబిల్లి చూసేను నిన్ను నన్ను ,అష్టవిధనాయికల్ని వర్ణిస్తూ బాలు పాడినపాట మేలుకోకవిరాజ మేలుకోవయ్యామొదలైనవి).
==చిత్రకథ==
వరదయ్య మువ్వ గ్రామంలో ఆకతాయి గా ఉంటాడు. తన మరదలు (ప్రభ) ను ప్రేమిస్తాడు. ప్రభ వరదయ్య తో చనువుగావుండటం చూసిన ఆమె తండ్రి ప్రభ బాలవితంతువు అని చెబుతాడు. బాధతో ఉన్న వరదయ్యను వివాహమాడతానని కూచిపూడి భాగవతుల కుటుంబంలోని భామ(మంజుల) అడుగుతుంది. తల్లి అనుమతి ఉంటే వివాహమాడతానని వరదయ్య చెప్పి తల్లి అడుగుతాడు. కుల బెధంతోబేధంతో తల్లి అందుకు అంగీకరించదు.తను ప్రేమించిన మరదలు, తనను ప్రేమించిన భామ దూరంకావటంతో వరదయ్య విరక్తుడౌతాడు. భామ సోదరుడు (రాజబాబు) భామ ఆత్మహత్య చేసుకుందని జనాన్ని నమ్మించి ఆమె ను వరదయ్య దగ్గర చేరుస్తాడు. మువ్వ గోపాలస్వామి కటాక్షం తో వరదయ్య మంచి కవి ఔతాడు. అతని గీతాలు విన్న గోలకొండ తానీషా అతన్ని తన దగ్గరకు ఆహ్వానిస్తాడు.
 
== పేర్లు ==
 
"https://te.wikipedia.org/wiki/మహాకవి_క్షేత్రయ్య" నుండి వెలికితీశారు