బనగానపల్లె - [[నంద్యాల]] మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, [[నందవరం (నందవరం మండలం)|నందవరంలో]] '''చౌడేశ్వరీమాత ఆలయం''' ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు. ఈ [[దేవాలయం]]లో అమ్మవారి గురించి స్థలపురాణ గాథ ఇలా ఉంది -పూర్వం నందవరాన్ని పాలించేరాజు ఒకమారు కాశీలో పండితులకు తానిచ్చిన మాట మరచిపోయి, తన వాగ్దానాన్ని తప్పాడు. విప్రుల ప్రార్థన మేరకు వారికి సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తు కాశీ విశాలాక్షి విప్రుల వెనుక బయలుదేరింది కాని ఎవరూ వెనుకకు తిరిగి చూడరాదని షరతు పెట్టింది. అయితే నందవరం చేరేప్పటికి విప్రులు వెనుకకు తిరిగి చూచారు. వెంటనే అమ్మవారు శిలారూపం దాల్చింది. విషయం తెలుసుకొన్న రాజు పరుగున వచ్చి అమ్మవారికి మ్రొక్కి విప్రులకు కానుకలిచ్చాడు. ఆ అమ్మవారే చౌడేశ్వరిగా పూజలందుకొంటున్నది. చౌడేశ్వరి ఆలయం ప్రక్కనే కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నాయి. సంతానం కోరేవారు ఈ ఆలయప్రాంగణంలో ఉన్న వృక్షానికి మ్రొక్కుతారు. ప్రతి సంవత్సరం [[ఉగాది]] రోజు నుండి ఆరు రోజులపాటు అమ్మవారి [[బ్రహ్మోత్సవాలు]] జరుగుతాయి.<ref>'''కుముదం భక్తి స్పెషల్''' జనవరి 2008 సంచికలో వ్యాసం - వ్యాస రచయిత : '''ఆలా మహాలక్ష్మీ నరసింహం'''</ref>: