ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{విస్తరణ}}
'''ఆచార్య ఆత్రేయ''' (Acharya Atreya) గా సినీరంగ ప్రవేశం చేసిన '''కిళాంబి వెంకట నరసింహాచార్యులు''' ([[1921]] - [[1989]]) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత, నిర్మాత మరియు దర్శకులు. అత్రేయకి ప్రముఖ నటుడు [[కొంగర జగ్గయ్య]] ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు.
 
అత్రేయకి ప్రముఖ నటుడు [[కొంగర జగ్గయ్య]] ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = [[ఆత్రేయ]]
Line 41 ⟶ 39:
 
==జీవిత సంగ్రహం==
[[1921]] [[మే 7]] న [[నెల్లూరు]] జిల్లాలోని [[సూళ్ళూరుపేట]] మండలంలో గల [[మంగళంపాడు]] గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగా ప్రాచుర్యమ్ పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లబించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.
[[1921]] [[మే 7]] న [[నెల్లూరు]] జిల్లాలోని [[సూళ్ళూరుపేట]] మండలంలో గల [[మంగళంపాడు]] గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ.
 
 
చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగా ప్రాచుర్యమ్ పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లబించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.
 
 
ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించిన ప్రస్తావన ఉండటం వలన ఆయన '''మనసు కవి''', '''మన సుకవి ''' అయ్యాడు. [[దీక్ష]] (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన [[సంసారం (1950 సినిమా)|సంసారం]] చిత్రానికి తొలిసారి కధా రచన చేసారు. [[వాగ్ధానం]] (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు.
 
 
చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి [[1989]],[[సెప్టెంబర్ 9]] న స్వర్గస్తులయ్యారు.
Line 113 ⟶ 105:
==ఆత్రేయ గురించి==
*రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని ఆయనపై ఓ ఛలోక్తి. కానీ ఆయన ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్తానో ఎందరికి తెలుసు అనేవారు.
 
 
*తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత ఆయనను ''బూత్రేయ'' అనీ అన్నారు.
 
 
*ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు "కళింగ" అందుకే "పల్లవి" తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే కళింగులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.
Line 124 ⟶ 114:
 
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[శారద]] లు నటించిన "[[ఇంద్రధనుస్సు]]" సినిమాలోని పాట "'''నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి'''" అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. ఆయనే ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.
 
*ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే ఆయన రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, [[డాక్టర్ చక్రవర్తి]] సినిమాలోని "'''మనసున మనసై బ్రతుకున బ్రతుకై'''" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి [[శ్రీశ్రీ]] గా లబ్ధప్రతిష్టుడైన శ్రీరంగం శ్రీనివాసరావు.
 
 
*వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే ...... సినిమాలో "'''కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిదానా'''" పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.
Line 167 ⟶ 155:
| [[Image:Manasu_gati_inte_cover.jpg|centre|100px|]] || cell||ఆత్రేయ పాటలని 2007 వ సంవత్సరంలో ఒక పుస్తక రూపంలో <ref name=avkf.org>ఎవికేఎఫ్.ఆర్గ్ వెబ్సైట్ నుండి సేకరణ. [http://www.avkf.org/BookLink/view_authors.php?cat_id=2473 మనసు గతి ఇంతే...ఆత్రేయ][[జూన్ 11]],[[2008]]న సేకరించబడినది.</ref> విడుదల చేసారు.[[ఎవికేఎఫ్.ఆర్గ్]] వెబ్సైట్ నుండి ఆన్ లైన్ ద్వారా కొనవచ్చు.[http://www.avkf.org/BookLink/view_authors.php?cat_id=2473 లింకు]
|-
| cell || cell||
|}
 
Line 173 ⟶ 161:
*{{imdb name|0040490}}
{{మూలాలజాబితా}}
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
<!-- అంతర్వవికి లింకులు--->
[[వర్గం:1921 జననాలు]]
[[వర్గం:1989 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు