మిస్సమ్మ (1955 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో సవరణలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
budget =
}}
'''మిస్సమ్మ''' చిత్రం [[జనవరి 12]] [[1955]] న విడుదలైంది. ఇది ఒక అద్భుతమైన పూర్తినిడివి హాస్య చిత్రం. [[ఎల్.వి.ప్రసాద్]] దర్శకత్వంలో రుపోందిన ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతి పెద్ద హీరోలుగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘన విజయము సాధించిన ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినది మాత్రము మహానటి సావిత్రి. ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, [[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]], బాలకృష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఒక చిన్న పాత్రలో మీకు కనిపిస్తారు.
 
సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు. మిస్సమ్మ చిత్రము యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క "మన్మొయీ గర్ల్స్ స్కూల్" అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి, [[పింగళి నాగేంద్రరావుచక్రపాణి]]లు రచించగా [[ఎల్వీ ప్రసాదు]] దర్శకత్వంలో రూపొందిచబడింది. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య మొదలైన వారి నటనతో సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది.
 
ఈ సినిమాకు [[పింగళి నాగేంద్రరావు]] రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని. ఆయన సాహిత్యమూ, [[ఎ.ఎం.రాజా]], [[పి.లీల]], [[పి.సుశీల]] గార్ల గాత్రమాధుర్యమూ కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేసాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికీ తెలుగు వారిని అలరిస్తూ ఉన్నాయి. పి.లీల పాడిన ''కరుణించు మేరిమాత'' అనేపాట హృదయాలను తాకుతుంది.
"https://te.wikipedia.org/wiki/మిస్సమ్మ_(1955_సినిమా)" నుండి వెలికితీశారు