వేదము వేంకటరాయ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎జీవిత విశేషములు: పుస్తకాన్ని యధాతథంగా ఇక్కడ రాసేశారు. వికీ శైలిలో కూడా లేదు అందువల్ల ఈ విభాగాన్ని తొలగించాను.
ట్యాగు: 2017 source edit
పంక్తి 50:
కొన్ని చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం)
ఇంకా '''ఉషానాటకం''' (1901), '''బొబ్బిలి యుద్ధం''' (1916) ఇతడు వ్రాసిన నాటకాలు.
 
==జీవిత విశేషములు==
1.పూండ్ల రామకృష్ణయ్య గారు శాస్త్రిగారికి వ్రాసిన జాబులో.... ''తే 22-3-'02 నెల్లూరు...ఆర్యా, నమస్కారములు.
.......నేనురోగినైనాడను. దూరమునడువ లేను. ఎండసోకగూడదు. ఎట్లుజీవించగలనో దిగులుగానున్నది రాజైశ్వర్యములు వలసియున్నవి. ఆర్జననున్న...కుదురుపాటు చిక్కలేదు. చిత్తచాంచల్యము మెండుగానున్నది. ఇందుచే బక్షవాయువు వచ్చునట్లు తోచుచున్నది ఏదివచ్చినను ననుభవించక తీరదుగదా. విశేషములులేవు.''
 
2.''శాస్త్రులవారికి... వీరువ్రాసినజాబులు దాదాపు రెండువందలు. వానిలో కడపటిది 30-4-'03 తారీఖున వ్రాయబడింది. తర్వాతజాబులేదు. పూండ్ల రామకృష్ణయ్యగారు శాస్త్రులవారికి ఆప్తమిత్రులై తమపత్రికను వారిపత్రికగానే జరిపి అనుక్షణము సలహాలను పొందుచుండినవారు. ఆంధ్రకవిపండిత సంఘసమరమున శాస్త్రులవారికి తోడునీడగానుండిరి. పెక్కు అముద్రిత గ్రంథములను చక్కగా సంస్కరించి బహుగ్రంథ పరామర్శపూర్వకములైన విపులవిమర్శలతో ముద్రింపించిరి. 1904 సం. సెప్టెంబరు 1 తేదినాడు నెల్లూర, స్వర్గస్థులైరి. అముద్రిత గ్రంథచింతామణియు నిలిచిపోయింది.''
 
3.''శ్రీ శాస్త్రులవారు మదరాసు క్రైస్తవకళాశాలలో సంస్కృత ప్రధానపండితులుగాను శ్రీ సమర్థి రంగయసెట్టిగారి మరణానంతరము కాలేజిలో ప్రాచ్యభాషా ప్రవచనాధ్యక్షులుగాను (Superintendent of Vernacular studies) దాదాపు ఇరువదినాలుగు సంవత్సరములుండి 1910 సంవత్సరమున జనవరినెలలో విరమించిరి. ''
 
4.''..... ఒకదినము విస్తారము వర్షముకురియుచుండెను. శాస్త్రులవారు ఒక పెట్టెలో వస్త్రాదికములుంచుకొని, ఉడుపు ధరించి
జోరువర్షములో గొడుగున్నను, తడిసి, కళాశాలచేరి, ఆ తడసిన దుస్తునుతీసి పెట్టెనుండి వేఱుదుస్తుధరించి తరగతికి పోయిరి. ఆదినము అనేకులు అథ్యాపకులు రాలేదు. ప్రిన్సిపాలుగారు, దొర, శాస్త్రులవారితో నిట్లనెను. "శాస్త్రిగారూ, చూచారా, ఏవిధంగావర్షంకురుస్తున్నదో ఫలానివారు రాలేదు. వారిపనికూడా తాము చూడగలరా." శాస్త్రులవారికి నాడు విస్తారము పనియుండెను. పైగా శాస్త్రులవారికే ఎక్కువపని తగులుచుండెను. అధికారులకును ఇతరాథ్యాపకుల యందు పక్షపాతముండినది. వెంటనే శాస్త్రులవారు "వర్షమే ఒకకారణంగా తాము భావించేపక్షములో నేనుకూడారాక ఇంటనే ఉందునే" అని శాస్త్రులవారు బదులుపలికిరి.''
 
5.'' ..... వేసవికాలమున నొకదినమున తరగరిలో విద్యార్థియొకడు, శాస్త్రులవారు పాఠము చెప్పుచుండగా నిద్రబోవుచుండెను. దొర ఎచటినుండియోవచ్చి, శాస్త్రులవారి యనుమతిలేకయే వారిగదిజొచ్చి, ఆవిద్యార్థినిలేపి, శాస్త్రులవారినిచూచి Do you allow the boys to sleep in the class? అని యడిగెను. (విద్యార్థులను తరగతిలోనే నిద్రబోనిచ్చెదవా? అని యర్థము.) శాస్త్రులవారికి కోపమువచ్చింది. తరగతిలో తాము పాఠముచెప్పునప్పుడు తమ యనుజ్ఞలేకయే లోనప్రవేశించుట మర్యాదగాదు. వెంటనే వారు 'I do my duty' (నేను నాధర్మమును నెఱవేర్చుచున్నాను) అని బదులిచ్చిరి. ఈదెబ్బకు ఏమి బదులుచెప్పుటకును తోచక దొర వెడలి పోయెను.''
 
6.'' ....శాస్త్రులవారికి ఎక్కుడుపని తగులుచుండెడిది. ఆవిషయమును తెలుపుటకై వారు అప్పుడప్పుడు ఇట్లడుగువారు. Who is the only christian in our college? అని అందులకు విద్యార్థులు మిల్లరనియు, (ప్రిన్సిపాల్) కాక మఱియొకరనియు చెప్పువారు శాస్త్రులవారు 'No! It is myself. I live by the sweat of my brow.' అని బదులుచెప్పువారు. మథ్యాహ్నము కార్యాధిక్యముచే వారిమొగమంతయు చెమటచే నిండిపోయెడిది.''
 
7.'' ....శాస్త్రులవారికి ఈనౌకరిలో పెన్షనురాదు. కళాశాలవారు మొత్తముగా కొంతద్రవ్యమొసంగు నేర్పాట్లేవో చేసియుండిరి. శాస్త్రులవారికి సంస్కృతాంధ్ర గ్రంథములను పెక్కింటినిశోధించి ముద్రింపవలయునని కోర్కెయునుండినది. మరల నచ్చాఫీసును ప్రారంభించుటకై తమకు పరీక్షకాధికారములచేత నేర్పడిన ద్రవ్యమునుచేర్చి దాదాపు మూడువేల రూప్యములను ఆర్బత్ నేటుబ్యాంకిలో వేసియుండిరి. ఈడబ్బున్నదను ధైర్యముతో అచ్చాఫీసు ప్రారంభింపదలంచి ఒకప్పుడు తాముద్యోగమును వదలుకొనెదమని తమ ప్రిన్సిపాలుతో చెప్పగా నాతడు అంతగొప్ప సంస్కృతపండితుడు మరల తమకు దొరకడనియు, శాస్త్రులవారిని అంతత్వరగాపంపివేయుట తమకిష్టము లేదనియు ఇంకను కొంతకాల ముండవలసినదనియు కోరిరి. శాస్త్రులవారు రాజీనామానొసంగెదమని ఎంతచెప్పినను దొరలు ఒప్పుకొనలేదు ఆదినము సాయంకాలము శాస్త్రులవారు ఇంటికి వచ్చుచు మార్గమున ఆర్బతునేటు బ్యాంకిమునిగిపోయినదని తెలిసికొనిరి. రాజీనామాను దొరలోప్పుకొనకపోయినది మంచిదే యైనదనితలంచి కొంతకాలము ఆపనియందేయుండిరి.''
 
8."నేను నాయాంథ్రాభిజ్ఞాన శాకుంతలమును ప్రకటించి వారికి ఒకప్రతి పంపితిని (శ్రీ వేంకటగిరి మహారాజా, కీ.శే. శ్రీ రాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరు). అంతటవారు నాతో సమావేశముంగోరి మదరాసు [[మౌంటురోడ్డు]] మోతీమహలులో నాకు దర్శనమొసంగి సల్లాపానంతరము నాకు కొంతధనము పారితోషిక మొసంగవచ్చిరి. నేను వారిని ఇట్లు ప్రశ్నించితిని. 'ఈగ్రంథము ముద్రితమైనది. దీనికై యిపుడునేను అధమణున్ండనుగాను. జీవనమునకై నాకు క్రిశ్చియన్కాలేజిలో కొలువున్నది. ఏలఏలినవారు నాకు ఈధనమీయవలయును. ఏలనేను కైకొనవలయును?' అంతట వారు సెలవిచ్చిరి, 'మీకు కాలేజిలో జీతము స్వల్పము. అదిమీకు కుటుంబభరణమునకే చాలదు.మీరువ్రాయవలసినది, మేము ముద్రింపవలసినది. మనమిరువురము పరస్పరసాహాయ్యముతో ఈతీరున లోకోపకారము చేయవలసినది. కావున మీరు ఈలేశమును గ్రహించుట 'యుక్తము.' ఆమాటకును ఆప్రసాదమునకును నేను అత్యంతము సంతుష్టుడనై ఆపైకమును గ్రహించితిని. అప్పటినుండి నేను ప్రకటించిన ప్రతిపుస్తకమునకును, పుస్తకాదినిమిత్త నిరపేక్షముగా సయితము, వారు అప్రార్థితముగా నాకు మెండు ధనమిచ్చుచుండిరి."
 
9. '''ఇట్లు కొందఱు వదాన్యులు ధనమిచ్చినను, ఒకప్పటికి కూడిన ధనము ముద్రణాదికృత్యములకు పర్యాప్తముగాక యుండినది. ఆంధ్రగైర్వాణగ్రంథములనే రమారమి రు 900 లకు కొనవలసివచ్చింది. దుర్దైవవశమున మందదృష్టినైతిని. దానంజేసి కార్యసహాయులకై రు 1500 ఎక్కుడుగానే వ్యయమయినది. ఆసమయమున, నేను రిక్తుడను రుగ్ణుడను, నిరాయతిని బహుకుటుంబిని, ఉక్తకారణములచేత బహువ్యయుండనుంగాన, ముద్రణమునకు తక్కువపడిన ధనమును వ్యయించుటకు స్వశక్తి లేకయు నుంటిని. దానినెఱింగి యీ గ్రంథము తప్పకముద్రితమగుగాకయని నెల్లూరుజిల్లా కావలి తాలుకా ఇందువూరుగ్రామ్యవాస్తవ్యులు, భూస్వాములు శ్రీయుతులు ఎఱబ్రోలు రామచంద్రారెడ్డిగారు ....... నాకు ఏతద్గ్రంథ ముద్రణపూర్తికై అప్పుడప్పుడు రు. 2500 ల పరిమితిం జెందువఱకు విరాళమొసంగిరి.' ఈవిధముగా నీగ్రంథము 1927 సం జూలయినెలలో వెలువడినది. 'చేసెదనింకదత్పరత సేవలు చూడికుడుత్త దేవికిన్‌' అని 1913 సం కావించిన ప్రతిజ్ఞను ఇన్నాళ్ళకు చెల్లించుకొని 'చేసితినిప్డు తత్పరత సేవలు చూడికుడుత్తదేవికిన్‌' అని ముద్రించారు. ఆముక్తమాల్యద ముద్రితమై వెలువడినప్పుడు వారిహర్షమునకు మేరలేదు.''
(పుట. 184)
 
10. '' ...... ప్రతిదినమును ప్రొద్దున నొకటి రెండుగంటలు శరీరముపై స్పృహయుండెడిది. తర్వాత జ్వరము వచ్చెడిది. ఒడలు తెలియనిస్థితి. గంజి ఆహారము. ఉపనయనానంతరము నేను చెంతకుపోయితిని. 'మీకు, ఒంట్లో ఎట్లున్నదండీ?' అని యడిగితిని 'పరమ పదం, పరమపదం' అనిమాత్రము చాలకష్టముతో చెప్పగల్గిరి. ఆవెనుక వారికి [[చైతన్యము]] లేదు. మరల తెల్లవారులోపల 1929 సం. (1929) జూనునెల 18 తేది [[మంగళవారము]] వేకువను 5-45 గంటలకు పరమపదించిరి.'
<ref>వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము రచయిత వేదము వేంకటరాయ శాస్త్రి, సంవత్సరం1943 ప్రచురణకర్త వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్</ref>
 
==వారసత్వం==