హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కార్తీక రాజు (చర్చ | రచనలు) |
కార్తీక రాజు (చర్చ | రచనలు) |
||
పంక్తి 97:
== దర్శనీయ స్థలాలు ==
* [[వేయి స్థంభాల గుడి]]: 11వ శతాబ్దంలో [[కాకతీయులు|కాకతీయ వంశానికి]] చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన [[వేయి స్తంభాల గుడి]] [[వరంగల్]] నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ [[హనుమకొండ]] నగరం నడిబొడ్డున ఉంది.
* వన విజ్ఞాన కేంద్రం : [[వరంగల్ జంతు ప్రదర్శనశాల]] లేదా వన విజ్ఞాన కేంద్రం తెలంగాణ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడింది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్ హంటర్ రోడ్ వద్ద ఉంది.
* [[ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం]] : [[వర్ధన్నపేట]] మండలంలోని [[ఐనవోలు|ఐనవోలులో]] ఈ దేవాలయం ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( క్రీ .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు.
|