వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Kodaliraghini (చర్చ | రచనలు) వ్యాసం విస్తరించ బడినది |
Kodaliraghini (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
''శ్రీ రాజా '''వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు''''' ([[ఏప్రిల్ 27]], [[1761]] - [[ఆగష్టు 17]], [[1817]]) అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా, [[గుంటూరు]] ప్రాంతమును పరిపాలించిన కమ్మ [[రాజు]]. [[అమరావతి]] సంస్థాన పాలకుడు.కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. వందకు పైగా దేవాలయాలను నిర్మించారు.
== జననం ==
పంక్తి 10:
== రాజ్యాభిషేకం ==
వేంకటాద్రి నాయుడు గారు కీ.శ. 1783 లో పరిపాలన చేపట్టారు. వీరి పాలనలో కృష్ణా జిల్లాలో 204 గ్రామాలు. గుంటూరు జిల్లాలో 344 గ్రామాలు, రాజమండ్రి జిల్లాలో 4 గ్రామాలు మొత్తం 552 గ్రామాలు ఉన్నాయి. అయితే 1214 ఫసిలీ ప్రకారం వాటిలో 22 గ్రామాలు ఇతరులకు విక్రయించినట్లు ఉంది. కృష్ణా మండలములోని చింతపల్లి వీరి తొలి రాజధాని. వీరికి నిజాం సుల్తాన్ నుండి ''''మన్నె సుల్తాన్, మనసబ్ దార్''' ' అనే బిరుదులు ఇచ్చారు<ref name=":0">{{Cite book|title=కమ్మవారి చరిత్ర|last=భావయ్య చౌదరి|first=కొత్త|publisher=పావులూరి పబ్లికేషన్|year=2005|location=గుంటూరు|pages=158-160}}</ref>.
క్రీ.శ. 1791-92లో వచ్చిన భయంకర [[ఉప్పెన]]లో తీరాంధ్ర గ్రామములలో వేలమంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరము తీవ్రమైన కరవు వచ్చింది. నాయుడు గారు ఏడు సంవత్సరములుగా పేరుకుపోయిన పన్నులు, మూడున్నర లక్ష్లల బంగారు నాణెములు ప్రజల కొరకు వినియోగించుటకు [[బ్రిటిషు|బ్రిటీషు]] ప్రభుత్వానికి తెలియచేశారు. మచిలీపట్టణం లోని అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ సంస్కరణలలో ఈ విషయము మరుగున పడింది<ref name=":0" />.
== అమరావతి ==
పంక్తి 21:
=== పిండారీల అణిచివేత ===
1816 లో [[పిండారీ]] దండులను సమర్దవంతంగా ఎదుర్కొని తన ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు వేంకటాద్రినాయునింగారు<ref>The Journal of Asian Studies
Association for Asian Studies, 1965, Vol. 24, No. 1, p. 296, ISSN 0067-7159</ref>. వేంకటాద్రి పాలనలో పిండారిలతో పాటు స్థనికంగా [[చెంచులు]] కూడా దారిదోపిడులు చేయుచు సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]]గా మారింది. ఆ తరువాత దీనికి పశ్చాత్పాపము చెంది తన శేషజీవితం అమరేశ్వరుని చెంత గడిపారు<ref name=":0" />.
== దేవాలయాల నిర్మాణం ==
కృష్ణా డెల్టా ప్రాంతమందు 108 [[దేవాలయము]]లు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి. అమరావతి లోని అమరేశ్వర పునర్మించి దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో [[మంగళగిరి]] [[నరసింహ స్వామి]] దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. 1803 లో బాపట్ల లోని భావన్నారాయణ స్వామి భూదానం చేసారు. చేబ్రోలులో చతుర్ముఖాలయం నిర్మించారు. గుంటూరు రామచంద్ర అగ్రహారంలోని మల్లీశ్వరస్వామికి భూదానం చేసినట్లు 1193 ఫసిలిలో ఉంది<ref name=":0" />.
ఆయన చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారు. కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశారు. వేంకటాద్రి నాయుడితో పాటుగా ఆయన మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. కొన్ని యాత్రలు క్రీ.శ.1802, మరికొన్ని క్రీ.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది.<ref name="చారిత్రిక శ్రీశైలం">{{cite book|last1=లక్ష్మీనారాయణ|first1=కొడాలి|title=చారిత్రిక శ్రీశైలము|date=1967|edition=ప్రథమ ప్రచురణ}}</ref> 1806 లో వీరు ఒకసారి బంగారంతోనూ, రెండు సార్లు వెండితోనూ తులాభారం తూగి పండితులకు పంచిపెట్టారు. 66 గ్రామాలలో బ్రాహ్మణ అగ్రహారాలు ఏర్పాటు చేసారు. ఇవి కాకుండా మరో 30 గ్రామాలలో వీరుచేసిన దానాల గురించి లోకల్ రికార్డులలో ఉన్నాయి<ref name=":0" />.
=== నూతన జనవాసాల నిర్మాణం ===
ఆయన తండ్రి జగ్గ భూపతి పేరు మీదనే '''బేతవోలు''' అనే గ్రామం పేరును [[జగ్గయ్యపేట]]గా మార్చాడు. ఆయన తల్లి అచ్చమాంబ పేరు తో [[అచ్చంపేట (గుంటూరు జిల్లా)|అచ్చంపేట]] అనే గ్రామాన్ని నిర్మించారు. తన పేరుతో [[రాజాపేట (చిలకలూరిపేట మండలం)|రాజాపేట]], నాయుడి పేట నిర్మించారు<ref name=":0" />,
== మరణం ==
వేంకటాద్రి నాయుడు తన శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. వారు [[1817]], [[ఆగష్టు 17]] న మరణించాడు. వీరికి ఇద్దరు భార్యలు. ఇద్దరికి సంతానం కలుగలేనదువల్ల జగన్నాధబాబు, రామనాధబాబు అనే ఇద్దరిని దత్తుతీసుకున్నారు.
[[ముదిగొండ శివప్రసాదు]] గారు నాయుడుగారిపై 'పట్టాభి' అను చారిత్రక నవల వ్రాశారు.
|