దువ్వూరి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 1:
[[భారతీయ రిజర్వ్ బాంక్]] గవర్నర్‌గా నియమితుడైన దువ్వూరి సుబ్బారావు [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]కు చెందిన తెలుగు వ్యక్తి. [[అమెరికా]]లోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. [[నెల్లూరు]] జాయింట్ కలెక్టర్‌గా, [[ఖమ్మం]] జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. ఇటీవలి వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం [[భారతదేశం|భారతదేశపు]] కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులైనాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావుకు ఇతడు మూడవ సంతానం. కోరుకొండ సైనిక పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తిచేసి బిఎస్సీకై సీఆర్ఆర్ కళాశాలలో ప్రవేశించాడు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందినాడు. [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి <ref> ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 02-09-2008 </ref> ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.
==నిర్వహించిన పదవులు==
*[[1988]]-[[1993|93]] : కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రెటరీగా
పంక్తి 11:
* అత్యధిక జ్ఞాపకశక్తి ఉన్న వారితో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంఘంలో ఇతడు సభ్యుడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 02-09-2008 </ref>
* ఆర్థిక కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడైన తొలి వ్యక్తి <ref> సాక్షి దినపత్రిక, పేజీ 2, తేది 02.09.2008 </ref>
*
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}