మన దేశం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 36:
==కథ==
రామనాథం అగ్రహారంలో సంపన్నుడైన గృహస్తుడు. అతని భార్య జానకి. కొడుకు నెహ్రూ. రామనాథం సవతి తల్లి యశోద. ఆమె కొడుకు మధు. యశోద రామనాథాన్ని కన్నకొడుకుగా చూసుకుంటూ ఉంది. ఇంట్లో పెత్తనమంతా ఆమెదే. మధు రాజకీయాలలో పాల్గొనడం యశోదకు ఇష్టం లేదు. తల్లికి కొడుకుకూ ఈ విషయంలో రగడ జరుగుతూనే ఉంటుంది. కానీ వదిన జానకి మధును బుజ్జగిస్తూ బుద్ధులు చెబుతూ ఉంటుంది.
చుట్టపు చూపుగా జానకి పినతండ్రి, ఆయన కూతురు శోభ అగ్రహారం వస్తారు. శోభకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నచూపు. మధుతో ఈ విషయంలో ఘర్షణ పడుతుంది. తన తండ్రికి అంటరాని వాడిగా చూశారనీ, చావిడిలో భోజనం పెట్టారనీ శోభ అలుగుతుంది. తండ్రితో కూడా వెంటనే పట్నం ప్రయాణమౌతుంది. రామనాథం కూడా వారితో బయలుదేరుతాడు. మద్రాసులో శోభ రామనాథం పరమ ఛాందసుడు కాడని తెలుసుకుని తన తప్పు దిద్దుకుంటుంది. యశోద కూడా శోభ నిష్కారణంగా అలిగి వెళ్ళింది అనే కించతో నెహ్రూ, మధులను తీసుకుని మద్రాసుకు వెళుతుంది. శోభ, మధుల పరస్పరాను రాగం వారి మాటల్లో గోచరమౌతుంది.
కాంగ్రెస్ సమావేశానికి మధు అధ్యక్షత వహిస్తాడు. పోలీసులు ఆ సభను భగ్నం చేస్తారు. మధుకు దెబ్బలు తగులుతాయి. ఆగష్టు విప్లవంలో దెబ్బలు తగిలిన స్థితిలోనే మధు అరెస్ట్ అవుతాడు. దేశ స్వాతంత్ర్యం కోసం యువకులుపడే కష్టాలను ప్రత్యక్షంగా చూసిన శోభకు కనువిప్పు కలిగి తనూ రంగంలోనికి దూకుతుంది. తెగువగా సాహసాలు చేస్తుంది. పోలీసుల చేతికి చిక్కకుండా మెలుగుతుంది. రామనాథం కుటుంబం తిరిగి అగ్రహారం చేరుతారు. పోలీసులు శోభ కోసం రామనాథం ఇంటిని సోదా చేసి రామనాథాన్ని విద్రోహిగా అరెస్టు చేస్తారు. ఈ అన్యాయాన్ని చూస్తూ ఆవేశంతో యశోద కూడా అరెస్టు అవుతుంది.
==పాటలు==
|