ఈ సినిమా కథా నాయకుడు: అక్కినేని నాగేశ్వరావు: అప్పటికెఅప్పటికే నాగేశ్వరావు రొమాంటిక్ కథానాయకుడిగా అగ్ర స్థానంలో ఉన్నారు. ఆరాధన చిత్రంలోని కథానాయకుడు అంధుడు. దాన్ని అభిమానులు స్వీకరిస్తారా?,,,,, అని సందేహించారు. కథలో భలంబలం వున్నందున చివరికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని పాట ఒకటి "[[శ్రీశ్రీ|శ్రీ శ్రీ]]'' (శ్రీ రంగం శ్రీనివాసరావు ) వ్రాశారు. అది ''నాహృదయంలో నిదురించె చెలీ ....'' భావోద్వేగ గీతాల రచయితగా ముద్ర పడ్డ శ్రీ శ్రీ ఈ పాటను వ్రాసారంటే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. అప్పట్లో శ్రీ శ్రీని ఎవరో ఆట పట్టించడానికి ''నీహృదయంలో నిదురించే చెలి ఎవరు'' అని ప్రశ్నించగా శ్రీ శ్రీ ''కమ్యూనిజం'' అని అన్నారని చాల మంది చెప్పుకున్నారు. ఆ పాట ఈ నాటికి తెలుగు వారి హృదయాలలో నిలిచే ఉంది. అత్యంత ప్రజారణప్రజాదరణ పొందిన ఈ సినిమాకు ఖర్చు పెట్టినది కేవలం: రెండు లక్షల రూపాయలు మాత్రమే.''