ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి అధికారిక వెబ్సైట్ లో కడప వాడుక లేదుInquisitive creature (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3360270 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20210922sim)) #IABot (v2.0.8.1) (GreenC bot
పంక్తి 124:
విజయనగర సామ్రాజ్యం [[కన్నడ భాష|కన్నడ]], [[తెలుగు]], [[తమిళ భాష|తమిళం]], [[సంస్కృతము|సంస్కృతాలలో]] లలిత కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించింది. ఈ కాలంలోనే [[కర్ణాటక సంగీతం]] ఆధునిక రూపంలోకి అభివృద్ధి చెందింది.<ref name="Kannadaempire">Historians such as P. B. Desai (''History of Vijayanagar Empire'', 1936), Henry Heras (''The Aravidu Dynasty of Vijayanagara'', 1927), B. A. Saletore (''Social and Political Life in the Vijayanagara Empire'', 1930), G.S. Gai (Archaeological Survey of India), William Coelho (''The Hoysala Vamsa'', 1955) and Kamath (Kamath 2001, pp. 157–160)</ref> విజయనగర సామ్రాజ్య కాలంలో, [[పెమ్మసాని నాయకులు]] ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించారు. వారు పెద్ద కిరాయి సైన్యాలను కలిగి ఉన్నారు, ఇవి పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి రక్షణగా ఉన్నాయి. [[లేపాక్షి]]లో శివ, విష్ణు, [[వీరభద్ర స్వామి దేవాలయం,లేపాక్షి|వీరభద్ర]] ఆలయాల సమూహం సాంస్కృతికంగా, పురావస్తుపరంగా ముఖ్యమైనవి. వీటిలో విజయనగర రాజుల కుడ్య చిత్రాలు, ద్రావిడ కళ, శాసనాలు ఉన్నాయి. ఆలయ సముదాయం దగ్గర పెద్ద గ్రానైట్ [[నంది]] శిల్పం ఉంది.
 
సా.శ. 1347లో, [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశంలో]] ఢిల్లీ సుల్తానుకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు ఫలితంగా అల్లావుద్దీన్ బహమన్ షా చేత [[బహమనీ సామ్రాజ్యం|బహమనీ సుల్తానేట్]] స్వతంత్ర ముస్లిం రాజ్యంగా స్థాపించబడింది. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ బహమనీ సుల్తాన్ కొలువులో పనిచేశాడు. గోల్కొండను జయించి అధిపతి అయ్యాడు. 1518లో బహమనీ సామ్రాజ్యము పతనమై ఐదు దక్కన్ సుల్తనేట్ ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించాడు. [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశం]] పదహారవ శతాబ్దం ప్రారంభం నుండి పదిహేడవ శతాబ్దం చివరి వరకు సుమారు రెండు వందల సంవత్సరాలు పట్టు సాధించింది.<ref name="Richards">{{Cite journal|last=Richards|first=J. F.|year=1975|title=The Hyderabad Karnatik, 1687–1707|url=https://archive.org/details/sim_modern-asian-studies_1975-04_9_2/page/241|journal=Modern Asian Studies|volume=9|issue=2|pages=241–260|doi=10.1017/S0026749X00004996}}</ref>
 
సా.శ.1687లో మొగల్ రాజు ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంతో మొగలుల ప్రత్యక్షపాలన ప్రారంభమైంది. సా.శ.1724 లో మొగల్ రాజప్రతినిధి గావున్న నిజామ్ ఉల్ ముల్క్ అనే బిరుదు గల చిన్ కిలిచ్ ఖాన్ ను అసఫ జా బిరుదుతో దక్కన్ పాలకుడుగా వుండుటకు అప్పటి మొగల చక్రవర్తి మహమ్మద్ షా అనుమతించడంతో అసఫజాహీ వంశ పాలనప్రారంభమైంది. సా.శ. 1766 లో నిజాం ఆలీఖాన్ పాలనలో [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కార్లను]] [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి]] అప్పగించగా, అవి [[మద్రాసు ప్రెసిడెన్సీ|మద్రాస్ ప్రెసిడెన్సీలో]] భాగమయ్యాయి. తరువాత ఇతర తీరప్రాంతాలు కూడా కంపెనీ పాలనలో చేరాయి. సా.శ.1800 లో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ సైన్యసహకారపద్ధతికి అంగీకరించి [[నిజాం| నిజాం ఆలీఖాన్]] ఐదు భూభాగాలను (అప్పటి కర్నూలు, కడప, అనంతపూరు,చిత్తూరు, బళ్లారి భూభాగాలు) కంపెనీ వారికి అప్పగించాడు. స్థానిక స్వయంప్రతిపత్తికి బదులుగా [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటిష్ పాలనను]] అంగీకరించి, నిజాం [[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాద్]] రాచరిక రాష్ట్రంగా అంతర్గత ప్రాంతాలపై నియంత్రణను సాధించాడు.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు