మైమ్ మధు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
డిగ్రీలో ఉన్నపుడు అతడి కాలేజీలోని ''ప్రేక్షక సభ'' అనే ఓ సాంస్కృతిక సంస్థ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ కళాకారుడిగా ఎంపికయ్యాడు. సరిగ్గా అదే సమయంలో భారత ప్రభుత్వం కోల్‌కతాలో జరిగే జాతీయ ఐక్యతా సమ్మేళనానికి ఇద్దరు కళాకారులను పంపమని ప్రేక్షకసభను కోరింది. ఆ ఇద్దరిలో ఒకడిగా వెళ్లాడు మధు. కోల్‌కతా లో పేరొందిన మైమ్‌ కళాకారుడు నిరంజన్‌ గోస్వామిని కలిసి ఆయన శిష్యుడిగా చేరాడు. ఆయనతో కలిసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చాడు.
 
తర్వాతి ప్రపంచమంతటా పేరున్న మైమ్‌ ఆర్టిస్ట్‌ టోనీ మోంటనారోతో కలిసి పని చేశాడు. యు.ఎస్‌. మైమ్‌ థియేటర్‌ మోంటనారో పేరు మీద ఏటా ఒక్కరికి స్కాలర్‌షిప్‌ ఇస్తుండేవాళ్లు. 2000లో ఆ స్కాలర్‌షిప్‌ ఎంపికయ్యాడు మధు. కానీ వెళ్ళడానికి అతని ఆర్థిక స్థోమత సరిపోలేదు. [[చిన్న జీయర్ స్వామి|చినజీయర్ స్వామి]] ఇతని ప్రదర్శన చూసి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. ఈ సహాయంతో అమెరికాలో నెలరోజుల పాటు శిక్షణ పొందాడు. శిక్షణ పూర్తయ్యాక అమెరికాలోని అన్ని నగరాల్లో ప్రదర్శనలిచ్చాడు. మైమ్‌లో పరిపూర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఇండియా తిరిగొచ్చాక యోగా నేర్చుకున్నాడు. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము|హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం]] నుంచి రంగస్థల కళల్లో స్నాతకోత్తర విద్యను అభ్యసించాడు. కేరళ యుద్ధవిద్యయైన [[కలరిపయట్టు]] నేర్చుకున్నాడు. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది.<ref name="Mime in the time of memes">{{cite news |last1=Telangana Today |first1=Telangana |title=Mime in the time of memes |url=https://telanganatoday.com/mimicry-in-the-time-of-memes |accessdate=24 September 2021 |publisher=Priyanka Pasupuleti |date=13 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210924181818/https://telanganatoday.com/mimicry-in-the-time-of-memes |archivedate=24 September 2021}}</ref>
 
==ఇండియన్‌ మైమ్‌ అకాడెమీ స్థాపన==
"https://te.wikipedia.org/wiki/మైమ్_మధు" నుండి వెలికితీశారు