భార్యా భర్తలు ఇద్దరు కలిసి [[నాదస్వరం]] వాయించడము వీరి ప్రత్యేకత. వీరి ప్రతిభకు మెచ్చి తమిళనాడు ప్రభుత్వము వీరికి ''కలైమామిలి '' పురస్కారాన్ని ప్రసాదించి గౌరవించింది. భారత రాష్ట్రపతుల ఎదుట వీరి పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశము వీరికి కలిగింది. దంపతులుగా భారతదేశములో ఇటువంటి అరుదైన గౌరవాన్ని పొందిన వారు ఎవరు లేక పోవడము వీరి గొప్పతనము.సుబానీ, కాలేషాబీ దంపతులకు 89.11..2021 న పద్మశ్రీ అవార్డు ఇచ్చారు .వీరి కుటుంబంలో ఎనిమిది తరాలు స్వరార్చనలోనే ఉన్నారు.నాదస్వరానికి రాగవిస్తారం (ఘనరాగాల)తో చిలకలూరిపేట బాణి తెచ్చారు.దూదేకుల ముస్లింలైన వీరి సంగీతార్చనతో ఎందరో దేవుళ్లు నిద్రలేస్తారు.ఏడో తరానికి చెందిన నాదబ్రహ్మ, నాదస్వర గానకళా ప్రపూర్ణ షేక్ చినపీరు సాహెబ్ చిలకలూరిపేటలో నివసించిన ప్రాంతానికి చినపీరుసాహెబ్ వీధిగానే నామకరణం చేశారు. నాదస్వర విద్వాంసుడిగా పేరొందిన షేక్ చినపీరు సాహెబ్కు ముందు 1825 నుంచి వారి వంశీకులు షేక్ నబీసాహెబ్, షేక్ చిన నసర్దీ, పెద నసర్దీ సోదరులు, షేక్ పెద హుస్సేన్, చిన హుస్సేన్, దాదాసాహెబ్, గాలిబ్సాహెబ్ సోదరులు నాదస్వర విద్వాంసులే. చినపీరు సాహెబ్ వద్ద శిష్యరికం చేసిన షేక్ ఆదంసాహెబ్ సంగీత విద్వాంసుల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.మరో శిష్యుడు కరువది షేక్ చినమౌలాసాహెబ్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. షేక్ చినపీరుసాహెబ్ మనవడే (కూతురి కుమారుడు) షేక్ మహబూబ్ సుభాని. ఆయన భార్య షేక్ కాలేషాబీ కూడా చినపీరుసాహెబ్కు వరుసకు మనవరాలే. సుభాని దంపతుల కుమారుడు షేక్ ఫిరోజ్బాబు కూడా తల్లిదండ్రులతో పాటు నాదస్వర విద్వాంసుడే.సుభాని తండ్రి షేక్ మీరా సాహెబ్ వద్ద నాదస్వరంలో ఓనమాలు దిద్దారు. షేక్ కాలేషాబీ తన తొమ్మిదో ఏట ఆమె తండ్రి షేక్ జాన్సాహెబ్ వద్ద నాదవిద్య అభ్యసించారు. 1978లో వీరి వివాహం అనంతరం కర్నూలు ప్రభుత్వ శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రమౌళి వద్ద కొంతకాలం పద్మశ్రీ డాక్టర్ షేక్ చినమౌలానా సాహెబ్ వద్ద నాదస్వరం అభ్యసించారు.2010 అక్టోబర్ నుంచి ఆలిండియా రేడియోలో వీరు టాప్గ్రేడ్ నాదస్వర విద్వాంసుల ద్వయంగా కొనసాగుతున్నారు.