తెలుగు సాహిత్యం యుగ విభజన: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
పంక్తి 2:
 
==యుగ విభజన సౌలభ్యం==
యుగ విభజన అనేది అధ్యయనంలో ఒక కొండగుర్తుగా ఉపయోగపడుతుంది. కొన్ని విశిష్టమైన, సమానమైన ధర్మాలు గల కాలాన్ని ఒక "యుగం" అని వ్యవహరిస్తారు.<ref>ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర</ref> అంటే ఒక కాలంలోని సాహిత్యంలో సమానమైన, లేదా విలక్షణమైన అంశాలను ఆ యుగం పేరుతో గుర్తిస్తారు. యుగ విభజన ఎలా చేసినా గాని అది సమగ్రం మరియు నిర్దుష్టం అని చెప్పలేము. అందేదో ఒక విధముగా అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషములు కనిపిస్తూనే ఉంటాయి. ఒకే విధమైన కావ్యములు వివిధ కాలాలలో వెలువడవచ్చును. ఒకే కాలంలో బహువిధాలైన రచనలు కూడా రావచ్చును. ఒక కాలంలో పెక్కురు ఉద్ధండులైన పండితులుండవచ్చును. వాఙ్మయకారులు తమ అభిరుచిని బట్టి సౌకర్యం కోసం ఎలాగైనా యుగ విభజన చేయవచ్చును.<ref>దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము</ref>
 
వాఙ్మయంలో అంతర ప్రవృత్తి, బాహ్య ప్రవృత్తి అనే రెండు అంశాలున్నాయి. ఇవి కాలాన్నిబట్టి మారడం మనం గ్రహించవచ్చును. అందుకు బయటి భాషా, జాతుల సంపర్కం ఒక కారణం. సమాజాంతర్గతమైన మార్పులు మరొక కారణం. సాహితీ ప్రక్రియలలో అంతకు ముందు కాలంనుండి ఒక ముఖ్యమైన మార్పు సంభవించిన "హద్దు"ను యుగం మారందని చెప్పే సమయంగా భావించవచ్చును. సాహిత్య చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు సాహితీమూర్తులనే యుగకర్తలుగా గుర్తించడం భావ్యం అని పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయం.
 
Line 26 ⟶ 25:
 
==ప్రముఖ కవుల ననుసరించి==
పింగళి లక్ష్మీకాంతం తన "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో "యుగకర్త"లైన మహాకవులను ఆయా యుగాలను గుర్తించే దీపస్తంభాలుగా పరిగణించాడు. ఈ విధానాన్ని చాలామంది అంగీకరించారు. <ref>ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర</ref>
 
'''తెలుగు వికీపీడియాలో వ్యాసాల విభజన, వర్గీకరణ, మూసలకు ఈ విభజననే పాటించడం జరుగుతున్నది.'''
 
తన విభజన విధానాన్ని వివరిస్తూ పింగళి లక్ష్మీకాంతం ఇలా చెప్పాడు - "యుగ విభాగము సహేతుకముగా (రేషనల్ గా) ఉండవలెను. కాని నిర్హేతుకముగా వుండ చనదు. ఎవరి చిత్తము వచ్చినట్లు వారు (యథేచ్ఛగా) చేయరాదు . ఆయుగకర్తల పేరు మీదుగా వాఙ్మయ చరిత్రను విభాగము చేయుట సమంజసమైన పద్ధతి. .. సాహిత్య చక్రవర్తులగు కవి సార్వభౌములకు మారుగా వారికాశ్రయమునిచ్చిన ధారుణీశ్వరులను సారస్వత సింహపీఠిక నుంచుట అన్యాయము. ఏ యగమునందైనను ఒక రాజు ప్రశస్తమైన కవి కూడనైనచో ఆ యుగమతని పేరుమీద నుంచదగును. అదియు నాతని కవిగా నెంచియే.. .. ఆ రాజులు పోయిరి. ఆ వంశములును ఏనాడో అస్తమించిపోయినవి. ఇక కవిరాజులు వారి గ్రంధ రూపములలో సజీవులైయున్నారు. వీరిని త్రోసిపుచ్చి గతించినవారికై అన్వేషణ జరుపుట భావ్యము కాదు. వారి రాజ్యముల కంటెను వీరి (సాహితీ) రాజ్యములు స్థిరములు, అజరామరములు. .. ఆంధ్ర కావ్య పథమును తీర్చి దిద్దిన మహాకవి నన్నయ పేరుమీద ఈ యుగ విభజన ఆరంభమగుచున్నది" <ref>పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర</ref>
 
# ప్రాఙ్నన్నయ యుగము : క్రీ.శ. 1000 వరకు