తెలుగు సాహిత్యం యుగ విభజన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
పింగళి లక్ష్మీకాంతం తన "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో "యుగకర్త"లైన మహాకవులను ఆయా యుగాలను గుర్తించే దీపస్తంభాలుగా పరిగణించాడు. ఈ విధానాన్ని చాలామంది అంగీకరించారు. <ref>ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర</ref>
 
'''తెలుగు వికీపీడియాలో వ్యాసాల విభజన, వర్గీకరణ, మూసలకు ఈ విభజననే పాటించడం జరుగుతున్నది.'''
 
తన విభజన విధానాన్ని వివరిస్తూ పింగళి లక్ష్మీకాంతం ఇలా చెప్పాడు - "యుగ విభాగము సహేతుకముగా (రేషనల్ గా) ఉండవలెను. కాని నిర్హేతుకముగా వుండ చనదు. ఎవరి చిత్తము వచ్చినట్లు వారు (యథేచ్ఛగా) చేయరాదు . ఆయుగకర్తల పేరు మీదుగా వాఙ్మయ చరిత్రను విభాగము చేయుట సమంజసమైన పద్ధతి. .. సాహిత్య చక్రవర్తులగు కవి సార్వభౌములకు మారుగా వారికాశ్రయమునిచ్చిన ధారుణీశ్వరులను సారస్వత సింహపీఠిక నుంచుట అన్యాయము. ఏ యగమునందైనను ఒక రాజు ప్రశస్తమైన కవి కూడనైనచో ఆ యుగమతని పేరుమీద నుంచదగును. అదియు నాతని కవిగా నెంచియే.. .. ఆ రాజులు పోయిరి. ఆ వంశములును ఏనాడో అస్తమించిపోయినవి. ఇక కవిరాజులు వారి గ్రంధ రూపములలో సజీవులైయున్నారు. వీరిని త్రోసిపుచ్చి గతించినవారికై అన్వేషణ జరుపుట భావ్యము కాదు. వారి రాజ్యముల కంటెను వీరి (సాహితీ) రాజ్యములు స్థిరములు, అజరామరములు. .. ఆంధ్ర కావ్య పథమును తీర్చి దిద్దిన మహాకవి నన్నయ పేరుమీద ఈ యుగ విభజన ఆరంభమగుచున్నది" <ref>పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర</ref>