వి.ఎల్.ఎస్.భీమశంకరం: కూర్పుల మధ్య తేడాలు

added death date
అశ్రు నివాళి
పంక్తి 36:
 
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (1928), ఇండియన్ జియోఫిజికల్ యూనియన్లో జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ ఆఫ్ జియో ఫిజిక్స్, [[ఆంధ్ర ప్రదేశ్]] అకాడమీ ఆఫ్ సైన్సెస్ మొదలగు సంస్థల గౌరవ సత్కారాలను అందుకున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ జియోసైన్స్ లో గౌరవ సభ్యత్వ గ్రహీత. వాన్ వీల్డెన్ అవార్డు, [[ఐరోపా సమాఖ్య|యూరోపియన్]] అసోసియేషన్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ జియోఫిజిక్స్, నెదర్లాండ్స్ (1957), డెసెన్ వీల్ అవార్డు, ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ అవార్డు (1981) మొదలైనవి అందుకున్నారు.
 
==అశ్రు నివాళి==
విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ డీన్ ఆఫ్ సైన్సెస్, ప్రముఖ ప్రౌఢ పద్యకవి, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే సాహిత్య రంగంలో 'జీవన సాఫల్య పురస్కార గృహీత', 'రసస్రువు', 'శివానంద మందహాసం' వంటి ఆధునిక ప్రబంధాల కర్త -ఆచార్య వి.ఎల్.ఎస్. భీమశంకరం గారు 19 నవంబర్ 2021, కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు పరమపదించారు.భూభౌతిక శాస్త్రంలో జెర్మనీ, ఇంగ్లాండ్ వంటి దేశాలలో పరిశోధనలు జరుపడంతోబాటు, నోబెల్ బహుమతి గ్రహీత అయిన పముఖ శాస్త్రవేత్త 'బ్లాకెట్' తో కలసి పనిచేసిన అపార అనుభవశాలి శ్రీ భీమశంకరం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భూవిజ్ఞాన శాఖను ప్రారంభించి, దానికి మొట్టమొదటి శాఖాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆయనది. అనంతరం 1987 - 89 మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా వ్యవహరించి నేటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అనేక గనుల వివరాలను వెలికి తీసి ఆనాటి ప్రభుత్వానికి అందజేసారు. 1994 - 96 మధ్య యూ.జీ.సీ. 'ఎమెరిటస్ ఫెలో'గా సేవలందించారు. పదవీ విరమణానంతరం ఆయన ప్రౌఢ పద్యకవిగా నూతన అవతారమెత్తారు. అనేక పద్య కృతులను రచించి సాహిత్య రంగంలో అనతి కాలంలోనే విశిష్ట కవిగా ఎనలేని కీర్తిని సాధించారు. అంతే కాకుండా 'వి.ఎల్.ఎస్. విజ్ఞాన, సారస్వత పీఠం' నెలకొల్పి ఎంతో మంది సాహితీ మూర్తులను, శాస్త్రవేత్తలను పురస్కారాలతో సత్కరించి, భాషా, విజ్ఞాన రంగాలకు సేవ చేసారు. 90 ఏళ్ళ ప్రాయంలో కొంత కాలంగా అనారోగ్యంతో ఉండి, పరమపదించిన ఆ మహాశాస్త్రవేత్త మరియు మహాకవికి విజ్ఞాన శాస్త్ర రంగ నిపుణులు, సాహితీవేత్తలు హృదయ పూర్వక అశ్రు నివాళులను సమర్పిస్తున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వి.ఎల్.ఎస్.భీమశంకరం" నుండి వెలికితీశారు